Thursday, May 16, 2024
- Advertisement -

ప్రభాస్ తో ఫస్ట్ రొమాన్స్ చేయడానికి రెడీ అయ్యింది!

- Advertisement -

బాహుబలి-2 తర్వాత ప్రభాస్ ఏ సినిమా చేయబోతున్నాడు అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే బాహుబలి-2 తర్వాత ప్రభాస్ పెళ్లి చేసుకుంటున్నాడా లేక కొత్త సినిమా మొదలు పెడుతాడా అనే అనుమానాలు ఆడియన్స్ లోనే కాకుండా ఇండస్ట్రీలోనూ చాలానే ఉన్నాయి. అయితే ప్రభాస్ మాత్రం సినిమా చేస్తాను అని అంటున్నాడు.

యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఓ థ్రిల్లర్ మూవీ చేస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఈ చిత్రం మొదలు కానున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త చిత్రంలో ప్రభాస్ సరసన నటించే హీరోయిన్ తోపాటు ప్రభాస్ తో తలపడే విలన్ కూడా పైనల్ చేశారు. రామ్ చరణ్ సరసన ఎవడు సినిమాలో నటించిన బ్రిటీష్ బ్యూటీ ఎమీ జాక్సన్ ప్రభాస్ తో ఫస్ట్ రొమాన్స్ చేయడానికి రెడీ అయ్యింది.

అలాగే ప్రభాస్ తో తలపడే విలన్ గా బాలీవుడ్ స్టార్ ను సెలెక్ట్ చేసుకున్నారు. తమిళంలో విజయ్ సినిమాలో అలాగే ఇప్పుడు చిరంజీవి రీమేక్ చేస్తోన్న కత్తిలాంటోడులో విలన్ గా నటించిన నీల్ నితిన్ ముఖేష్ ప్రభాస్ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్నికి రన్ రాజా రన్ ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ దర్శకుడికి రన్ రాజా రన్ తర్వాత చాలా ఆఫర్స్ వచ్చాయి. కాకపోతే ఈ కుర్ర డైరెక్టర్ తన రెండో చిత్రం ప్రభాస్ తోనే చేయాలి అని ఎన్ని ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో చెప్పాడట. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -