బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నిశితార్థం ఈ రోజు జరిగిందన తెలుస్తుంది.ప్రియాంక చోప్రా గత కొంతకాలంగా హాలీవుడ్ నటుడు, సింగర్ నిక్ జోనాస్తో ప్రేమలో ఉంది.వీరిద్దరూ కలిసి సన్నిహితంగా మెలగడం, బయట పార్టీలకు కలిసి అటెండ్ అవ్వడం వంటి విషయాలు వీరిలో ప్రేమలో ఉన్నారని కన్ఫర్మ్ చేశాయి. తాజాగా ఈ రోజు ముంబైలోని ప్రియాంక నివాసంలో వీరుద్దరి నిశ్చితార్థం జరిగింది.దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమైయ్యాయి.
సాంప్రదాయక పంజాబీ పెళ్లిలో మొదటగా జరిపే రోకా వేడుకలో ప్రియాంక, నిక్ జోనాస్ కలిసి కనిపించారు. ఈ పూజలో ఇద్దరూ సాంప్రదాయ దుస్తులు ధరించారు. సాధారణంగా ఈ వేడుకకు బయట వారిని అనుమతించరు.అమెరికా నుంచి నిక్ తల్లితండ్రులు కూడా వచ్చారు.అతి తక్కువ మంది సమక్షంలో ఈ నిశ్చితార్థం వేడుక జరిగిందని తెలుస్తుంది.ఈ రోజు(శనివారం)బాలీవుడ్ ప్రముఖులకు ప్రియాంక పార్టీ ఇవ్వనుందని సమాచారం.