Friday, May 17, 2024
- Advertisement -

జగన్ మాస్టర్ స్కెచ్‌..వారి ఓటమి ఖాయమేనా?

- Advertisement -

ఏపీ ఎన్నికల్లో వార్ వన్ సైడేనని టాక్ నడుస్తోంది. సర్వేలన్ని జగన్ రెండోసారి అధికారంలోకి రావడం ఖాయమని చెబుతుండగా కూటమికి భంగపాటు తప్పదని తేల్చేస్తున్నాయి. ఇక ఎన్నికల ప్రచారంలో తనదైన శైలీలో దూసుకుపోతున్న జగన్…కీలక నియోజకవర్గాల్లో కూటమి నేతల ఓటమికి మాస్టర్ స్కెచ్ వేశారు.

హిందూపురంలో బాలయ్య, పిఠాపురంలో పవన్‌, మల్కాజ్‌గిరిలో లోకేష్‌, అలాగే చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పం నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే ఈ నియోజకవర్గాలకు ప్రత్యేక ఇంఛార్జీలను సైతం నియమించారు. కుప్పం, హిందూపురం బాధ్యతలను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చూస్తుండగా పిఠాపురంకు మిథున్ రెడ్డి, మంగళగిరిలో వైసీపీ గెలుపు బాధ్యతను ఆళ్ల రామకృష్ణారెడ్డికి అప్పగించారు. ఈ నాలుగు స్థానాల్లో రెండు వైసీపీ సిట్టింగ్ స్థానాలు కాగా రెండు టీడీపీ సిట్టింగ్ స్థానాలు.

ఎన్నికల ప్రచారానికి 10 రోజుల సమయమే ఉండగా ఈ నాలుగు నియోజకవర్గాల్లో జగన్ ప్రచార సభలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. కుప్పంలో ఆపరేషన్ చంద్రబాబు స్ట్రాటజీతో ముందుకు వెళ్తుండగా ఇక్కడ త్వరలోనే సభ ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ నెల 4న హిందూపురంలో జగన్ రోడ్ షో ఉండగా పిఠాపురం, మంగళగిరిలో సైతం జగన్ భారీ సభలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ నాలుగు నియోజకవర్గాల్లో స్థానిక అంశాలతో పాటు సామాజిక వర్గ సమీకరణలు,బీసీ నినాదాన్ని ఎంచుకుని ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మొత్తంగా జగన్ చేస్తున్న ఈ ఆపరేషన్‌లో విజయం ఎవరికి దక్కుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -