ఎన్టీఆర్ జీవిత కథను సినిమాగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను ఆయన తనయుడు హీరో నందమూరి బాలకృష్ణ నిర్మిస్తున్నారు. సడన్గా ఈ సినిమా నుండి దర్శకుడు తేజ తప్పుకున్నాడు.ఏమైందో తెలియదు కాని ఈ సినిమాను తేజ సరిగ తెరకెక్కించలేరని భావించి తప్పుకున్నారని తేజ పిఆర్ఓ ప్రకటన ద్వారా తెలియజేశాడు.దీనిపై అటు బాలకృష్ణ కాని ఇటు తేజ కాని స్పందించలేదు.ఎన్టీఆర్ జీవిత చరిత్రను ఎలా చూపించాలన్నదాని పై బాలయ్య – తేజ మధ్య బేదాభిప్రాయాలు వచ్చాయని ప్రచారం జరుగుతోంది.
తేజ ఈ సినిమా నుండి తప్పుకున్న తరువాత ఈ సినిమాను ఎవరు తెరకెక్కిస్తారనే ప్రశ్న అందరిలోను ఉంది. దర్శకులుగా చాలామంది పేర్లే వినిపించాయి. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ,క్రిష్ ఇలా పేర్లు వినిపించిన ఒకనోక దశలో బాలయ్యే ఈ సినిమాకు దర్శకత్వ భాద్యతలు తీసుకుంటున్నారనే వార్తలు వచ్చాయి.ఇప్పుడు ఈ సినిమాకు పూరీజగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. . బాలయ్యతో పైసావసూల్ సినిమా చేసిన పూరి ,ఆ సినిమా పెద్దగా హిట్ కాకపోయినప్పటికి బాలకృష్ణ క్యారెక్టరైసేషన్ కి మాత్రం ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.
అంతే కాదు పూరీతో బాలయ్యకు మంచి సాన్నిహిత్యం కూడా ఏర్పడింది.ఆల్మోస్ట్ పూరి ఈ సినిమాకు ఫిక్స్ అయినట్లు సమాచారం.మెహబూబా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు పూరి . పూరి తనయుడు ఆకాష్ హీరోగా ఈ సినిమాలో చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ అయిపోయింది కాబట్టి ఎన్టీఆర్ సినిమాను బాలయ్య పూరికి ఇవ్వలని ఆలోచనలో ఉన్నాడని సమాచారం.మరి పూరి అయిన ఎన్టీఆర్ సినిమాను బాలయ్యకు నచ్చినట్లు తీస్తాడో లేదో చూడాలి.