Saturday, May 4, 2024
- Advertisement -

స్టుపిడ్స్‌కు అలానే జరుగుతుంది.. వైరల్ గా మారిన రాశీ ఖన్నా పోస్ట్!

- Advertisement -

టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించి సందడి చేస్తున్న రాశీ ఖన్నా ఆ తర్వాత సినిమా అవకాశాలు లేకపోవడంతో తన శరీరాకృతి పై దృష్టి పెట్టారు. ఎంతో బొద్దుగా ఉండే రాశీ ఖన్నా ప్రస్తుతం జీరో సైజు లోకి మారిపోయారు. ఈ క్రమంలోని టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అంటూ అన్ని భాషలలో వరుస అవకాశాలతో దూసుకు పోతున్నారు.

ప్రస్తుతం కోవిడ్ కారణంగా సినిమా షూటింగ్ లన్ని వాయిదా పడటంతో సినిమా సెలబ్రిటీలు అందరూ ఇంటికి పరిమితమయ్యారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రజలలో అవగాహన కల్పించడం కోసం ఎంతో మంది సెలబ్రెటీలు ముందుకు వస్తున్నారు. తాజాగా రాశీ ఖన్నా కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల పై స్పందించి పలు వ్యాఖ్యలు చేశారు.

Also read:ఎన్టీఆర్ కు కరోనా రావడానికి కారణం వాళ్లేనా?

ప్రస్తుతం మన దేశం ఎలాంటి పరిస్థితులలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మహమ్మారి దాటికి రోజుకు వేల సంఖ్యలో మరణిస్తున్నారు.ఇటువంటి సమయంలో ప్రతి ఒక్కరు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించడం ఎంతో శ్రేయస్కరం.బయటకు వెళ్ళినప్పుడు డబుల్ మాస్కులు ధరించాలని అధికారులు సూచిస్తున్న అప్పటికీ కొందరు మాత్రం మాస్కులు లేకుండా బయట తిరుగుతున్నారు. అలాంటి వారికి రాశీ ఖన్నా అదిరిపోయే కౌంటర్ వేశారు. మనం పోతే ఆ బాధ మనకు తెలియదు.. వేరే వాళ్లకు తెలుస్తుంది..స్టుపిడ్స్‌కు అలానే జరుగుతుంది.. దయచేసి మాస్కులు ధరించండి అని రాశీ ఖన్నా కోరారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also read:సుడిగాలి సుధీర్ వల్ల కన్నీళ్లు పెట్టుకున్న గెటప్ శ్రీను.. ఏం చేశాడంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -