ఈ మద్య సినీ ఇండస్ట్రీలో విషాదాలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖులు.. వారి ఇంట్లో వారు కన్నుమూస్తున్న విషయం తెలిసిందే. తాజాగా నటి రాయ్ లక్ష్మి తండ్రి రామ్ రాయ్ కన్నుమూశారు. ప్రస్తుతం రాయ్ లక్ష్మీ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాల్లో నటిస్తుంది. తన తండ్రి కన్నుమూసిన విషయాన్ని రాయ్ లక్ష్మి తన ట్విట్టర్ ఖాతాలో తెలిపింది. తన తండ్రిని కాపాడుకోలేకపోయానని, చాలా బాధగా ఉందని చెప్పింది.
తనను క్షమించాలని తన తండ్రిని కోరింది. తన తండ్రిని మిస్ అవుతున్నానని, ఈ బాధను నేను ఎలా అధిగమించగలనని ఆమె బాధపడింది. చిన్ననాటి నుంచి తన తండ్రి గుండెల్లో పెట్టుకొని పెంచారని.. ఆయన గొప్ప మనసు ఉన్న వ్యక్తి అని, ఆయన గుండె ఆగిపోయిందన్న విషయం చాలా బాధ కలిగిస్తుందని చెప్పింది.
తన కెరీర్ ముందుకు సాగించడానికి ఆయన ఎంతగానో కృషి చేశారు. తన తండ్రి లేరు అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నా అని అన్నారు. తన తండ్రి పై నుంచి తనను ఆశీర్వదిస్తారని తెలిపింది. ఆయన తనను ముందుకు నడిపిస్తారని తనకు తెలుసని చెప్పింది. ఈ సందర్భంగా గతంలో తన తండ్రితో దిగిన ఫొటోను ఆమె పోస్ట్ చేసింది.