ఉయ్యాలా జంపాలాతో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు రాజ్ తరుణ్. ఆ తర్వాత రాజ్ తరుణ్ కి మంచి ఫాలోయింగ్ వచ్చింది. మొదటి సినిమా హిట్ కావడం తో రెండో సినిమా గా చూపిస్తా మావా చేసాడు. ఈ చిత్రం కూడా హిట్ కావడం తో ఈ కుర్రాడికి వరసగా అవకాశాలు వచ్చాయి. మూడో చిత్రంగా కుమారి 21 ఎఫ్ మరో అధ్బుతమైన హిట్ అయ్యింది.
ఉదయ్ కిరణ్ తర్వాత తొలి మూడు సినిమాలతో హిట్లు కొట్టిన హీరోగా రాజ్ తరుణ్ నిలిచాడు. కాని ఇప్పుడు సరైన ప్లాన్ లేకపోవడమ్ వల్ల రాజ్ తరుణ్ ప్లాపులు చూస్తున్నాడు. సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు ఫ్లాప్.. ఆడోరకం ఈడోరకం యావరేజ్ గా నిలిచింది. ఇటివలే కొందరు దర్శకులు ఈ కుర్రాడితో సినిమా చేస్తాను అని ఇప్పుడు వద్దు అనుకుంటున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు రాజ్ తరుణ్ సుడి తిరిగినట్లు కనిపిస్తోంది.
ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ తో మూడు సినిమాలకు ఒకేసారి ఒప్పందం కుదుర్చుకున్నాడు రాజ్ తరుణ్. ఈ మూడు సినిమాల్లో నటించినందుకు గాను ఓ ఖరీదైన ఏరియాలో విల్లా అడిగాడట రాజ్ తరుణ్. దాని విలువ కోటిన్నర వరకు ఉంటుందని సమాచారం. అంటే ఒక్కో సినిమాకి 50 లక్షలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. డబ్బు కాకుండా ఓ విల్లా ఇవ్వండని అడగడంతో నిర్మాతలు కూడా ఓకే చెప్పారని టాక్ నడుస్తోంది ఇండస్ట్రీలో. సో మొత్తాన్నికి రాజ్ తరుణ్ దీపం పం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకుంటున్నాడు.