Friday, May 10, 2024
- Advertisement -

మల్లీ తెర మీద కుమారీ జంట !

- Advertisement -

ఉదయ్ కిరణ్ తరవాత తెలుగు సినిమాల్లో వరసగా తొలి మూడు సినిమాలూ హిట్ కొట్టిన ఘనత కేవలం రాజ్ తరుణ్ కి మాత్రమే చెల్లుతుంది. ఉయ్యాలా జంపాలా తో ఎంట్రీ ఇచ్చి సినిమా చూపిస్తా మావా తో రెండవ సినిమా హిట్ కొట్టేసి, కుమారీ 21 ఎఫ్ తో మూడవసారి ముచ్చటైన హిట్ కొట్టాడు రాజ్ తరుణ్. ఈ సినిమా తనకి కెరీర్ లో చాలా పెద్ద హిట్ అయ్యింది.

ఇలా వరసగా హిట్ లో కొడుతూ ఉంటే నిర్మాతలు సైతం రాజ్ తరుణ్ వెంటే పడుతున్నారట. సో తరుణ్ కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాడు సినిమాలు ఎంచుకునే విషయంలో. తాజాగా మంచు విష్ణు తో ఒక మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నాడు తరుణ్.

ఈ సినిమా లో తరుణ్ సరసన అవికా గొర్ నటిస్తోంది ఆమె తో ఉయ్యాలా జంపాలా లో నటించిన తరుణ్ లక్కీ పైర్ అనిపించుకున్నారు కూడా కానీ మనకి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సినిమా డైరెక్టర్ నాగేశ్వరరెడ్డి ఈ సినిమాలో కుమారీ ఫేం హెబా పటేల్ ని తీసుకోవాలని కోరుతున్నాడట.

అలా అయితే సినిమాకి మరింత క్రేజ్ వస్తుందని ఈ చిత్ర టీం భావిస్తోందట. ఇదే నిజమైతే కుమారి తో మరొక్క సారి రోమాన్స్ చెయ్యడానికి తరుణ్ సిద్దం అయినట్టే. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -