నందమూరి బాలకృష్ణతో దర్శకుడు క్రిష్ సినిమా చేయబోతున్నాడు అని వార్త చాలా మంది నమ్మలేదు. ఇది అంత రూమార్ అనుకున్నారు. ఎందుకంటే బాలకృష్ణ పక్కా మాస్ మసాలా సినిమాలు చేస్తుంటాడు. క్రిష్ మాత్రం క్లాస్ టచ్ ఉన్న సందేశాత్మక చిత్రాలు మాత్రమే తీస్తుంటాడు.
వీళ్లిద్దరు కలిసి సినిమా తీస్తారని ఎవరు ఊహించలేదు. అందరిలాగే మన దర్శక ధీరుడు రాజమౌళి కూడా అనుకున్నాడట. క్రిష్-బాలయ్యల కాంబినేషన్ బాగోదని అనుకున్నాడట. ఒకవేళ ఆ కాంబినేషన్ లో సినిమా వచ్చిన అది పక్కా ప్లాప్ అవుతోందని ఫిక్సయిపోయడట రాజమౌళి. ‘‘బాలయ్య గారి వందో సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడనగానే చాలామంది లాగే నాకు కూడా ఏదోలా అనిపించింది. బాలయ్య లాంటి మాస్ హీరోను క్రిష్ లాంటి క్లాస్ డైరెక్టర్ ఎలా చూపిస్తాడో అని సందేహించాను.
ఈ సినిమా మీద అనుమానాలు నెలకొన్నాయి. వీళ్లిద్దరూ కలిసి సినిమా చేయడమేంటి.. వీళ్లది బ్యాడ్ కాంబినేషన్ అని ఫీలయ్యాను. ఐతే కొన్నాళ్ల తర్వాత సాయి కొర్రపాటి గారు నన్ను కలిసి ఈ సినిమా గురించి చెప్పారు. క్రిష్ కథ చెప్పాడని.. చాలా బాగుందని.. అందులో రకరకాల ఎమోషన్లు ఉన్నాయని.. సినిమా ఆడేస్తుందేమో అని సందేహంగా ఉందని అన్నాడు. ట్రైలర్ చూడాగానే నా అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. సినిమా చూశాక అద్భుతంగా అనిపించింది. నాతో పాటు అందరి అభిప్రాయం తప్పని క్రిష్ నిరూపించాడు’’ అని క్రిష్ తో కలిసి పాల్గొన్న ఇంటర్వ్యూలో రాజమౌళి అన్నాడు.
Related