టాలీవుడ్ లో మోస్ట్ ఇంటిలిజెంట్ డైరెక్టర్ లో ఒకరు సుకుమార్.. ఆయన సినిమాలు కొత్త కథతో ఉంటాయి. మహేష్బాబుతో వన్ -నేనొక్కడినే, ఎన్టీఆర్తో నాన్నకు ప్రేమతో చిత్రాలు తీశాక సుకుమార్ క్రేజ్ బాగా పేరిగింది. ప్రస్తుతం సుకుమార్తో సినిమాలు చేయడనికి టాలీవుడ్ స్టార్ హీరోలందరూ ఎదురు చూస్తున్నారు.
ప్రస్తుతం ఈ డైరెక్టర్ మెగాపవర్స్టార్ రాంచరణ్తో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇదిలా ఉంటే సుకుమార్ ఓ సీనియర్ దర్శకుడి కాళ్లు పట్టుకున్నాడట. సుకూ మంచి దర్శకుడు అయినప్పటికి స్టోరీ చెప్పడంలో కొంచెం వీక్.. సినిమా స్టోరీ చెప్పమని అడిగితే కనీసం మూడునాలుగు గంటలు టైం తీసుకుంటాడట. ఈ సంగతిని స్వయంగా సుకుమారే చెప్పారు. ‘శ్రీవల్లి’ సినిమా టీజర్ రిలీజ్ సందర్భంగా సుకుమార్ ఈ విషయం వెల్లడించారు.
ఈ సినిమాకు టాలీవుడ్ దర్శకధీరుడు తండ్రి, స్టార్ రైటర్, డైరెక్టర్ విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా స్టోరీ విజయేంద్ర ప్రసాద్ చెప్పగానే సుకుమార్ భావావేశం ఆపుకోలేక ఆయన కాళ్లు పట్టుకున్నాడట. కేవలం 22 నిమిషాల్లో కథ మొత్తం చెప్పడం చూసి థ్రిల్ ఫీలయ్యాడట. ఆయనని తన గురువుగా భావించే కాళ్లు పట్టుకున్నానని సుకుమార్ తెలిపారు.
Related