బాహుబలి సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు దర్శక ధీరుడు రాజమౌళి.ఈ సినిమా తరువాత ఎన్టీఆర్-రామ్ చరణలతో ఓ భారీ మల్టీస్టారర్కు ప్లాన్ చేశాడు రాజమౌళి. ఈ సినిమా ఎనౌన్స్ చేసి చాలాకాలం అయింది, కాని ఇప్పటి వరుకు కథ సిద్దం కాలేదు.
రాజమౌళి మీద ఉన్న నమ్మకంతో ఇద్దరు హీరోలు కథ వినకుండానే సినిమాకు ఓకే చెప్పేశారు.అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం …మల్టీస్టారర్కు సంబంధించిన కథను పూర్తి చేసినట్లు వార్తలు వస్తున్నాయి.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పనులు రాజమౌళి ప్రారంభించినట్టుగా వార్తలు వస్తున్నాయి. బాహుబలి సినిమాకు ఆర్ట్ డైరెక్టర్గా పనిచేసిన సాబు సిరిల్ ఈ చిత్రానికి కూడా పని చేయనున్నారు.హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఓ భారీ సెట్ను నిర్మిస్తున్నారు.
ఈ సెట్లో యాక్షన్ సీన్స్తో పాటు కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. . ప్రస్తుతం ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న అరవింద సమేత, రామ్ చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రాలు పూర్తయిన వెంటనే రాజమౌళి మల్టీస్టారర్ సెట్స్ మీదకు వెళ్లనుంది.