ప్రముఖ నటుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ ఇవాళ ఉదయం కుటుంబసభ్యులతోకలిసి అమెరికాకు బయలుదేరారు. ప్రత్యేక విమానంలో ఆయన యూఎస్ వెళ్లారు. అయితే వైద్య పరీక్షలు, చికిత్స కోసమే రజనీకాంత్ అమెరికాకు వెళ్లినట్టు సమాచారం. ఆయనతోపాటు సతీమణి లతా రజనీకాంత్ కూడా వెళ్లారు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఖతార్ ఎయిర్వేస్లో దోహా ఇంటర్నేషనల్ విమానాశ్రయానికి తొలుత చేరుకొని .. అక్కడి నుంచి అమెరికాకు ప్రత్యేక విమానంలో వెళ్లారు. అమెరికాలో వైద్యపరీక్షల చేయించుకొని.. మూడు నెలల పాటు అక్కడే విశ్రాంతి తీసుకొని ఆ తర్వాత స్వదేశానికి తిరిగిరానున్నారు.
రజనీకాంత్ దర్శకుడు శివ కాంబినేషనల్లో అన్నాత్తే చిత్రం షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ చిత్రంలో తన పాత్రకు సంబంధించిన భాగాన్ని ఆయన పూర్తిచేశారు. అదే సమయంలో ఈ చిత్రం షూటింగ్ కూడా మరికొన్ని రోజుల్లో పూర్తికానుంది. ఆ తర్వాత డబ్బింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేయనున్నారు. 2011లో రజనీకాంత్ కు సింగపూర్ లో కిడ్నీ మార్పిడి చికిత్స జరిగింది. ఆ తర్వాత ఆయన అమెరికాకు వెళ్లి అక్కడ పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
Also Read: ఆ ఇద్దరు అగ్ర హీరోలూ.. అలా చేయడం ఇదే తొలిసారి..!
ఈ కిడ్నీ ఆపరేషన్తోపాటు పూర్తి స్థాయి వైద్య పరీక్షలు చేయించుకొని పదేళ్లు గడిచిన నేపథ్యంలో మరోసారి వైద్య పరీక్షల కోసం రజనీకాంత్ తన కుటుంబ సభ్యులతో కలిసి అమెరికాకు బయలుదేరి వెళ్లారు. ఇందుకోసం శనివారం వేకువజామున 1.45 గంటల సమయంలో చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుక వచ్చారు. ఆ సమయంలో అక్కడ వేచిఉన్న విలేకరులు ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. కానీ రజనీకాంత్ మాత్రం మీడియాల తో మాట్లాడకుండా రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తూ ఎయిర్పోర్టులోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత 3.40 గంటలకు ఖతార్ ఎయిర్వేస్ విమానంలో దోహాకు బయలుదేరారు. అక్కడినుంచి మరో ప్రత్యేక విమానంలో రజనీకాంత్ దంపతులు అమెరికాకు వెళ్లారు.
కాగా రజనీ అల్లుడు, సినీ హీరో ధనుష్ ఓ హాలీవుడ్ షూటింగ్ నిమిత్తం గత ఫిబ్రవరి నుంచి అమెరికాలోనే ఉంటున్నారు. ఆయనతోపాటు రజనీ కుమార్తె ఐశ్వర్యా కూడా అక్కడే ఉంటున్నారు. కాగా ధనుష్ తన సినీ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు స్వదేశానికి వచ్చినప్పటికీ ఐశ్వర్యా మాత్రం తన తల్లిదండ్రులతో కలిసి అమెరికాలోనే మూడు నెలలపాటు ఉండనున్నారు.
Also Read: ఏ సినిమా విడుదల ఎప్పుడు? అంతా గందరగోళమే..!