Tuesday, May 7, 2024
- Advertisement -

ఫ్యాన్స్ కు భయపడే రజనీకాంత్ ఆ సినిమా చేయలేదా..!

- Advertisement -

సూపర్ స్టార్లకు ఫ్యాన్సే ప్లస్ పాయింటే.. ఫ్యాన్సే మైనస్ పాయింట్! తెరపై తమ అభిమాన హీరో తాము కోరుకొన్నట్టే కనిపించాలని ఫ్యాన్స్ తపిస్తారు. ఈ విషయంలో ఏం తేడాలు వచ్చాని వారు తీవ్రంగా డిజప్పాయింట్ అవుతారు. ఈ విషయం స్టార్ హీరోలకు కూడా తెలుసు. అందుకే వారు అభిమానుల మనసులను ఎరిగి నడుచుకొంటున్నారు. ఇప్పుడు ఇందుకు ఉదాహరణగా సూపర్ స్టార్ రజనీకాంత్ ను ప్రస్తావించవచ్చు.

రజనీ అభిమాన బలగం ఎంతటిదో వేరే వివరించనక్కర్లేదు. అయితే ఇప్పుడు అభిమానుల భావోద్వేగాలను పరిగణనలోకి తీసుకొని రజనీ ఒక సినిమాను మిస్ అయ్యాడు. అదే “దృశ్యం” రీమేక్. మలయాంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను దక్షిణాది భాషలన్నింటిలోనూ రీమేక్ చేశారు. తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో రీమేక్ అయ్యింది. ఈ సినిమా. ఇటీవలే తమిళంలో ఇది విడుదలై హిట్ టాక్ ను సొంతం చేసుకొంది.

తమిళంలో ఈ సినిమాను కమల్ రీమేక్ చేశాడు. అయితే వాస్తవానికి ఇది ముందుగా రజనీఇంటి తలుపును తట్టిందట. మలయాళంలో ఈ సినిమాను రూపొందించిన జీతూ జోసెఫ్ రజనీకాంత్ ను సంప్రదించి ఈ సినిమాను రూపొందించే ఆలోచనను వివరించాడట. అయితే ఈసినిమాలో హీరో పోలీసుల చేతిలో దెబ్బలుతింటాడు.. అలా సీన్లలో తను చేస్తే అభిమానులు అంతగా ఇష్టపడరు అని రజనీ భావించినట్టు సమాచారం. అందుకే ఆయన ఈ సినిమాను వదులుకొన్నాడట.దీంతో జోసెఫ్ కమల్ ను సంప్రదించాడు.. సినిమాను రూపొందించాడు.. హిట్ కొట్టాడు!

ఈ విధంగా అభిమానుల మనోభావాలు సూపర్ స్టార్ కు ఒక సినిమా హిట్ ను మైనస్ చేశాయేమో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -