రజనీకాంత్ దర్శకుడు శంకర్ కాంబినేషన్లో వచ్చన రోబో ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికి తెలిసిందే.మళ్లీ ఇన్నాళ్లుకు వీరిద్దరి కాంబినేషన్లో రోబోకి సీక్వెల్ తెరకెక్కుతుంది.రెండు సంవత్సారాల నుంచి తీస్తున్న ఈ సినిమా ఇప్పుడు తుది దశకు చేరుకుంది.వినాయక చవితి సందర్భంగా టీజర్కు విపరీతమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ను ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్.రోబో 2.0ట్రైలర్ని దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం.
చెన్నైలో జరిగే ఈ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమానికి చిత్ర బృందమంతా హాజరుకానున్నట్లు తెలిసింది. టీజర్తోనే అదరగొట్టి అంచనాలు పెంచేస్తున్నాడంటూ తలైవా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో సుమారు 500 కోట్ల బడ్జెట్తో రూపొందుతున్న ఈ భారీ చిత్రంలో రజనీ సరసన అమీ జాక్సన్ హీరోయిన్గా నటిస్తుండగా.. బాలీవుడ్ యాక్షన్ ఖిలాడి అక్షయ్కుమార్ విలన్గా నటిస్తున్నాడు.