Tuesday, May 21, 2024
- Advertisement -

2.0 మ‌ధ్య‌లో చేయ‌న‌ని చేప్పేశా – ర‌జినీకాంత్‌

- Advertisement -

సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్‌కు ఒక్క త‌మిళంలోనే కాక ఇండియా మొత్తం క్రేజ్ ఉన్న సంగ‌తి తెలిసిందే.ర‌జ‌నీ సినిమాలు విడుద‌ల అవుతుంటే బాలీవుడ్ హీరోలు సైతం త‌మ సినిమాల‌ను వాయిదా వేసుకుంటారు.ఇక తెలుగులో కూడా ర‌జ‌నీకాంత్‌కు మంచి మార్కెట్ ఉంది.ర‌జినీ సినిమాలు విడుద‌ల రోజున‌ కార్పొరేట్ కంపెనీలు సైతం ఆ రోజున సెల‌వు ప్ర‌క‌టించిన సంద‌ర్భాలు చాలానే ఉన్నాయి.ర‌జినీ న‌టించిన గ‌త రెండు సినిమాలు స‌రైన విజ‌యాలు సాధించ‌క‌పోవ‌డంతో తీవ్ర నిరాశ‌లో ఉన్నారు త‌లైవా అభిమానులు.రోబో 2.0 కోసం అభిమానులు ఎప్ప‌టి నుంచో ఎదురు చూస్తున్నారు.రెండు సంవ‌త్స‌రాలు క్రితం మొద‌లైన 2.0 సినిమాకు స్ఠార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శక‌త్వం వ‌హించారు.ఇప్ప‌టికే విడుద‌ల చేసిన టీజ‌ర్‌కు సూప‌ర్ రెస్ప‌న్స్ వ‌చ్చింది.ఈ రోజు(శ‌నివారం) రోబో 2.0 ట్రైల‌ర్ లాంచ్ చేశారు. ఈ సంద‌ర్భంగా ర‌జినీకాంత్ మాట్లాడుతు ప‌లు ఆస‌క్త‌క‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు.ఈ సినిమా కోసం శారీరకంగా, మానసికంగా చాలా శ్రమ పడాల్సివచ్చింది. దాదాపు 12 కేజీలా సూట్ వేసుకొని షూటింగ్ చేయడం కష్టమనిపించేది. సినిమా 3డీలో తెరకెక్కిస్తున్న కారణంగా ఒకే షాట్ ని ఎనిమిది నుండి తొమ్మిది సార్లు తీయాల్సి వచ్చేది.

ఒక దశలో సినిమా చేయలేనని చెప్పేశా.. కానీ శంకర్ నన్ను ఒప్పించారు. షూటింగ్ మధ్యలో నా ఆరోగ్యం పాడైంది. దీంతో షూటింగ్ ఆలస్యమైంది. ఆ సమయంలో నిర్మాతలు నాకు ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేను. ఈ సినిమా తరువాత శంకర్ కి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుంది. నిర్మాతలు నన్నో అక్షయ్ నో నమ్మి రూ.600 కోట్ల పెట్టుబడి పెట్టలేదు.ఈ సంద‌ర్భంలో ర‌జినీ మ‌న ద‌ర్శ‌క ధీరుడు గురించి మాట్లాడ‌టం విశేషం.శంకర్, రాజమౌళి, రాజ్ కుమార్ హిరాని వంటి దర్శ‌కులు ఇండియాలో ఉండ‌టం అదృష్టం అని ర‌జినీకాంత్ వ్యాఖ్య‌నించారు.ఇక 2.0 ట్రైల‌ర్‌కు సూప‌ర్ రెస్ప‌న్స్ వ‌చ్చింది.ట్రైల‌ర్ విడుద‌లైన గంట‌లోనే కోటి వ్యూస్ సాధించి యూట్యూబ్‌ను షేక్ చేస్తుంది.పలువురు ద‌ర్శ‌కులు ట్రైల‌ర్ బాగుంద‌ని కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -