తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఎంత సింపుల్గా ఉంటారో అందరికి తెలిసిందే.రజనీకాంత్ క్రింద స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి.దీంతో ఆయన ఆడంబారాలకు దూరంగా ఉంటారు.తాజాగా జరిగిన మరో సంఘటన ఆయన వ్యక్తిత్వం ఏలాంటిదో తెలియజేసింది.స్థానిక పోయస్ గార్డెన్ లో ఉన్న తన నివాసం నుండి తన కూతురు ఐశ్వర్య ఇంటికి వెళ్లడం కోసం రజినీకాంత్ ఆటోలో ప్రయాణించారు. ఎప్పుడూ కార్ లోనే వెళ్లే రజినీకాంత్ ఈ విధంగా ఆటోలో ప్రయాణించడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది.
రాజకీయాల పరంగా త్వరలోనే రజినీకాంత్ తన కొత్త పార్టీ పేరుని ప్రకటిస్తారని ఆయన సోదరుడు ప్రకటించారు. రజినీకాంత్ రాజకీయ ప్రవేశంలో బీజేపీ జోక్యం లేదని రజినీకాంత్ సోదరుడు సత్యనారాయణ తెలిపారు. వచ్చే డిసంబర్ నాటికి పార్టీకి సంబంధించిన ఏర్పాట్లు పూర్తవుతాయని అన్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. రజినీకాంత్ ప్రస్తుతం కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేస్తోన్న ‘పేటా’ అనే సినిమాలో నటిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో 2.0 సినిమా కూడా విడుదలకు రెడీ అవుతుంది.