దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది.. బయటకు రావాలంటేనే భయంతో వణికిపోతున్నారు. ముఖ్యంగా సెలబ్రెటీలు ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నా కరోనా భారిన పడుతూనే ఉన్నారు. తాజాగా వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే నటి రాఖీ సావంత్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. తాజాగా రాఖీ సావంత్ కూరగాయలు కొనడానికి సమీప మార్కెట్కి వెళ్లారు.
జనాలు తనను గుర్తు పట్టకుండా ఉండటం కోసమే కాక.. కరోనా నుంచి కాపాడుకోవడం కోసం పీపీఈ కిట్ ధరించి మార్కెట్ వెళ్లారు రాఖీ సావంత్. చేతులకు గ్లౌవుజులు.. ఒంటి మీద పీపీఈ కిట్ ధరించిన రాఖీ సావంత్.. ఓ కూరగాయల బండి దగ్గరకు వెళ్లి బేరమాడి.. మంచి ధర చెల్లించి మరి కూరగాయలు కొన్నారు.
ఇక అన్ని కూరగాయలు కొన్న తర్వాత ఈ అమ్మడు ఒక్కసారే అరుస్తూ.. ఇన్ని కూరగాయలకు కేవలం మూడు వందల రూపాయలు మాత్రమేనా.. నా జీవితంలో ఇన్ని ఎక్కువ ఐట్సెం ఇంత తక్కువ ధరకు ఎప్పుడు కొనలేదని.. అందరూ ఇక్కడకు వచ్చి కూరగాయలు కొనాలని సూచించింది.
ఇందుకు సంబంధించిన వీడియోని తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు రాఖీ సావంత్. అంతేకాక బయటకు వెళ్లినప్పడు పీపీఈ కిట్ ధరించి వెళ్లడం చాలా మంచిది అంటూ అభిమానులకు సూచించారు. ప్రస్తుతం తెగ వైరలవుతోంది. రాజకీయ నాయకులకంటే మీరు వంద రేట్లు మేలు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు.