Wednesday, May 8, 2024
- Advertisement -

పుకార్లపై రకూల్ సీరియస్ వార్నింగ్!

- Advertisement -

టాలీవుడ్‌లో కెరటం చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయిన రకూల్ ప్రీత్ సింగ్ తర్వాత వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రంతో మంచి పేరు సంపాదించింది. అప్పటి నుంచి నేటి వరకు అంటే పదేళ్లుగా తెలుగులో సత్తా చూపిస్తూనే ఉంది. సినిమాలతో పాటు బిజినెస్‌లో కూడా తనదైన ముద్ర వేసింది.  రకుల్ వ్యక్తిగత జీవితం కూడా ఇటీవలి కాలంలో వివాదాస్పదంగా మారింది. ఆమెపై వచ్చినన్ని పుకార్లు, వార్తలు మరే హీరోయిన్ పై కూడా వచ్చుండవేమో.  రకుల్ కు హైదరాబాద్, వైజాగ్ లాంటి చోట్ల మూడు జిమ్స్ ఉన్నాయి.

ఎఫ్ 45 పేరుతో ఈమెకు హైదరాబాద్‌లో రెండు.. వైజాగ్‌లో ఫ్రాంచైజీలు ఉన్నాయి. వాటి నుంచి అమ్మడికి కోట్ల రూపాయలు వస్తున్నాయి. తాజాగా సమంత నిర్వహిస్తున్న స్యామ్ జామ్ షోకు గెస్టుగా వచ్చింది రకుల్ ప్రీత్ సింగ్. ఆమెతో పాటు దర్శకుడు క్రిష్ కూడా వచ్చాడు. ఈ సందర్భంగా తన పర్సనల్ విషయాలు కూడా చర్చించింది. మన గురించి పుకార్లు పుట్టించే వ్యక్తులు ఒక్క క్షణం కూడా మన గురించి ఆలోచించరని చెప్పింది.

నేను ఉంటున్న ఇల్లు కూడా ఒక వ్యక్తి గిఫ్ట్ గా ఇచ్చాడని ప్రచారం చేస్తున్నారని… ఎవరో తనకు ఇంటిని గిఫ్ట్ గా ఇచ్చినప్పుడు తనకు కష్టపడి పనిచేయాల్సిన పని ఎందుకు ఉంటుందని అన్నారు. అయినా అలాంటి వాళ్ల గురించి మాట్లాడి టైమ్ వేస్ట్ చేసుకోలేనంటూ చెప్పుకొచ్చింది రకుల్. ప్రస్తుతం వైష్ణవ్ తేజ్, క్రిష్ సినిమాతో పాటు నితిన్ చెక్ సినిమాలో నటిస్తుంది రకుల్. అలాగే హిందీలో మేడే సినిమాలో అజయ్ దేవగన్‌తో కలిసి నటిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -