- Advertisement -
తన జీవితంలో ఇంకా తనకు సరైనోడు దొరకలేదని, తాను నాలుగు ఇంచులు హైహీల్ వేసుకున్నా అతను ఇంకా పొడుగ్గా ఉండాలని, అలాంటి వాడి కోసం ఎదురుచూస్తున్నానని ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చెప్పారు.
ఆమె అల్లు అర్జున్ తో కలిసి నటించిన సరైనోడు చిత్రం శుక్రవారం నాడు విడుదలవుతోంది. అ సందర్భంగా రకుల్ విలేకరులతో మాట్లాడుతూ తనకు హైదరాబాద్ అన్నా.. ఇక్కడి బిర్యానీ అన్నా ఎంతో ఇష్టమని చెప్పారు.
విదేశాల్లో షూటింగులకు వెళ్లినప్పుడు హైదరాబాద్ ను మిస్ అయ్యానని ఫీలవుతానని రకుల్ చెబుతున్నారు. హైదరాబాద్ తనకు లైఫ్ ఇచ్చిందని, ఏ మాత్రం టైమ్ దొరికినా చార్మినార్ దగ్గరకు వెళ్లి హలీమ్ తింటానని రకుల్ ప్రీత్ సింగ్ చెబుతున్నారు.