Tuesday, May 7, 2024
- Advertisement -

మ‌హేశ్‌బాబు కోసం రానున్న యంగ్ టైగ‌ర్, చెర్రీ

- Advertisement -

వేస‌వి సినీ సంద‌డికి ‘రంగస్థలం’తో మంచి బూస్ట్ ఇచ్చాడు. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు నటించిన ‘భరత్ అనే నేను’ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం ఏప్రిల్ 7వ తేదీన హైద‌రాబాద్‌లో నిర్వ‌హించ‌నున్నారు. కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా ఇటీవ‌ల విడుద‌లైన పాట‌లు ఆక‌ట్టుకుంటున్నాయి.

అయితే ఈ ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం విశాఖ‌ప‌ట్ట‌ణంలో నిర్వహించాలనుకున్నారు.. ఆ తర్వాత విజయవాడ అనుకున్నారు.. ఎట్ట‌కేల‌కు చివ‌ర‌కు హైదరాబాద్‌లో నిర్వ‌హించ‌డానికి ఫిక్స‌య్యారు. ఏది ఏమైనా సినిమాకు ఇంకో ఆక‌ర్ష‌ణీయ‌మైన వార్త వినిపిస్తోంది. ఈ వేడుక‌కు ఇద్ద‌రు స్టార్ హీరోలు కూడా రాబోతున్నారు అని సమాచారం. వారిద్ద‌రి రాక‌తో ఆ కార్య‌క్ర‌మం సూప‌ర్‌హిట్‌గా నిలిచే అవ‌కాశం ఉంది.

ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ రానున్నార‌ని తెలుస్తోంది. చెర్రీ, తార‌క్ ఇద్ద‌రూ రాజ‌మౌళి సినిమాలో న‌టించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. ఏదో సంబంధంతో మ‌హేశ్ సినిమా కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌వుతున్నార‌ని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -