తన మావయ్య అల్లూ అరవింద్ తో సినిమా అనగానే తన తల్లి సురేఖ ఫుల్ హ్యాపీ అవుతున్నారు అని రామ్ చరణ్ చెబుతున్నాడు. తన కరీర్ లో సూపర్ హిట్ లుగా నిలిచినా రెండు సినిమాలూ మగధీర , ధృవ రెండూ అల్లూ అరవింద్ గారి నిర్మాణం లో చెయ్యడం హ్యాపీగా ఉంది అంటున్నాడు చరణ్ ‘‘నేను రికార్డుల గురించి పట్టించుకోను. అలాగే నెంబర్లు.. సీట్ల గురించి ఆలోచించను. అలా ఆలోచిస్తూ కూర్చుంటే ఏమీ చేయలేం. మంచి కథలను కూడా వదులుకోవాల్సి వస్తుంది.
మా మామ అల్లు అరవింద్ గారితో కలిసి సినిమా చేసిన ప్రతి సారీ మా అమ్మ చాలా ఆనందపడుతుంది. ‘మగధీర’ తర్వాత మరలా సినిమా చేయాలని నేను.. మావయ్య నాలుగేళ్లుగా అనుకుంటున్నాం. ఇప్పటికి కుదిరింది. అలాగే సురేందర్ దర్శకత్వంలో చేయాలని కూడా ఎప్పట్నుంచో అనుకుంటున్నా. ఒకసారి మణిరత్నం గారితో మాట్లాడినపుడు వైవిధ్యమైన కథల్ని వింటూ ఉండమని చెప్పారు. ఆ మాట నా మనసులో విత్తనంలా పడింది.
ఇప్పుడు ‘ధృవ’ సినిమాను అంగీకరించడానికి కూడా అదే కారణం’’ అని చరణ్ చెప్పాడు. ‘ధృవ’ను రిలీజ్ చేసే సమయంలో చాలా టెన్షన్ పడ్డామని.. కానీ ప్రేక్షకులు ఈ సినిమాకు మంచి ఫలితాన్నిచ్చారని అరవింద్ అన్నారు. ఈ ఏడాది కొడుకులిద్దరితో రెండు హిట్లు.. మేనల్లుడితో ఒక హిట్టు కొట్టిన తాను తండ్రిగా..మావయ్యగా చాలా సంతోషంగా ఉన్నానని అరవింద్ చెప్పారు.