సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి ప్రధానపాత్రలో స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈసినిమా షెట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.కోకాపేటలోని అరవింద్ సొంత ఫాం-హౌజ్లో వేసిన సైరా సెట్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సెట్ దాదాపుగా కాలిపోయింది. దీంతో సుమారు ₹ 2 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.
కొన్ని రోజులు గా ఇక్కడే సినిమాకు సంబంధించిన కీలక ఘట్టాలను చిత్రీకరిస్తున్నారు. గురువారం రాత్రి వరకూ చిత్ర బృందం షూటింగ్ జరిపింది.మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్ తో సినిమా తెరకెక్కుతోంది. మెగా పవర్ స్టార్ రామ్చరణ్ స్వయంగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మిస్తున్నారు.
ఈ ప్రమాదం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవడంతో ఆ చిత్ర నిర్మాత, టాలీవుడ్ హీరో రామ్ చరణ్ స్పందించారు.కోకాపేటలో సైరా చిత్రం కోసం తాము నిర్మించిన సెట్ అగ్నికి ఆహుతి అవడం దురదృష్టకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఫేస్ బుక్లో పోస్ట్ పెట్టారు.
‘కోకాపేటలో వేసిన సైరా సెట్ ఈ ఉదయం దురదృష్టవశాత్తు మంటల్లో చిక్కుకుంది. ఏ ఒక్కరికి ప్రమాదం జరగలేదు. చిత్రబృందం అంతా క్షేమంగా ఉంది. మా చివరి షెడ్యూల్ను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామ’ని ఫేస్బుక్ ద్వారా ఈ విషయాన్ని అభిమానులకు తెలియజేశారు.