మెగాపవర్స్టార్ రామ్ చరణ్ సినిమాకు ఘోర అవమానం జరిగింది. రంగస్థలం వంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన తరువాత రామ్ చరణ్ నటించిన చిత్రం వినయ విధేయ రామ. కమర్షియల్ డైరెక్టర్ బోయపాటి ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాని ఈ సినిమా అందరి అంచనాలను తలకిందులు చేస్తు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫ్లాప్ అయింది.
సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఘోరంగా ఫెయిల్ అయింది. రామ్ చరణ్ అభిమానులు సైతం సినిమాను చూసి తిట్టుకున్నారంటే సినిమా ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. తాజాగా ఈసినిమాకు మరో అవమానం జరిగినట్లు తెలుస్తోంది. అమెరికాలో కూడా ఈ సినిమా ఫ్లాప్గా నిలిచింది. అయితే ఆదివారం నాడు యూఎస్లోని ఓ థియోటర్కు ఒకే ఒక్క ప్రేక్షకుడు రావడం సంచలనం కలిగిచడంతో పాటు, ఆశ్చర్యాన్ని కూడా కలిగిచింది.
థియోటర్ మొత్తం మీద ఒక్క ప్రేక్షకుడు మాత్రమే వచ్చాడట. షో మొత్తం మీద ఒక్క టికెట్ మాత్రమే సేల్ అయిందని థియోటర్ యాజమాన్యం చెప్పడం విశేషం. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాకు దక్కని రికార్డు రామ్ చరణ్ సినిమాకు మాత్రమే దక్కిందని అంటున్నారు థియోటర్ యాజమాన్యం. ధృవ, రంగస్థలం సినిమాలతో నటుడిగా ఎంతో ఎదిగిన రామ్ చరణ్ వినయ విధేయ రామతో తిరిగి తన యధాస్థానానికి పడిపోయాడని అంటున్నారు సినీ విశ్లేషకులు. తెలుగుతో పాటు యూఎస్లో కూడా ఈ సినిమా ఘోరంగా ఫెయిల్ అయింది.
- దళిత స్పీకర్ దూషణ, ఎర్రవల్లి ఘటనలపై సీఎం రేవంత్రెడ్డి ఆగ్రహం!
- NZ VS INS: హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న మ్యాచ్ టికెట్లు!
- అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత.. బీఆర్ఎస్ సభ్యులంతా సస్పెండ్!
- యువతపై కేసులా? చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం!
- బిగ్బాష్ లీగ్ పై ఐపీఎల్ ఓనర్ల కన్ను!
