టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్ బాబు హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయిలో ఓ మల్టీప్లెక్స్ కడుతున్న సంగతి తెలిసిందే.ఏషియన్ సినిమాస్తో కలిసి మహేశ్ బాబు ఈ మల్టీప్లెక్స్ థియోటర్ను నిర్మిస్తున్నారు.బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటించి థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమాతో ఈ మల్టీప్లెక్స్ను మొదలుపెడదాము అనుకున్నారు.కాని అప్పటికి థియోటర్ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో ఆ సినిమాను ఆపేశారు.రోబో 2.0 సినిమాతో అయిన మహేశ్ మల్టీప్లెక్స్ను ప్రారంభిస్తారని అనుకున్నారు.
కాని అప్పుడు కూడా నిరాశే ఎదురైంది.సాంకేతిక లోపాలతో సినిమాను వేయలేదు.తాజాగా ఈ మల్టీప్లెక్స్ను సందర్శంచిన వివాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మహేశ్పై ప్రశంసలు వర్షం కురి పించాడు. ”ఇప్పుడే ఏఎంబి సినిమా స్క్రీన్స్ చూశాను. డిసంబర్ 2న ప్రారంభం కానుంది. బ్రీత్ టేకింగ్ ఎక్స్ పీరియన్స్.. మహేష్ బాబు ఎంత అందంగా ఉంటాడో మల్టీప్లెక్స్ కూడా అంత అందంగా ఉంది” అంటూ ట్వీట్ చేశారు.తాజాగా ఈ మల్టీప్లెక్స్ను డిసంబర్ 2న ఆదివారం నుండి మొదలుపెట్టనున్నారు.