వివాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తన నోటికి పని చెప్పాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ ట్రైలర్ నిన్ననే విడుదల చేశారు. ట్రైలర్ను ఫుల్ కమర్షియల్గా కట్ చేశాడు దర్శకుడు బోయపాటి. తాజాగా ఈ ట్రైలర్పై రామ్ గోపాల్ వర్మ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. . గోల్డ్, డైమండ్స్ మిక్స్ చేస్తే ‘వినయ విధేయ రామ’ ట్రైలర్ అంటూ వర్మ కితాబిచ్చారు. బోయపాటి ట్రైలర్ వావ్ అనిపించేలా ఉందని అన్నారు.
రాం చరణ్ సింపుల్ గా మైండ్ బ్లోయింగ్ గా కనిపిస్తున్నాడని ప్రశంసించారు. చరణ్ కు బెస్ట్ విషెస్ తెలిపారు. రామ్ గోపాల్ వర్మ మెగా ఫ్యామిలీ గురించి ఇలా పాజిటివ్గా మాట్లడటంపై అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను డివివి దానయ్య నిర్మించారు. సినిమాను సంక్రాంతికి కానుకగా జనవరి 11న విడుదల చేయనున్నారు.
- హనీమూన్ హత్య కేసులో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!
- కేబినెట్ సమావేశానికి మళ్లీ పవన్ గైర్హాజరు
- మరో పోరాటానికి సిద్దమైన వైసీపీ, ముహూర్తం ఫిక్స్..
- రంగనాథ్ను అరెస్ట్ చేయండి?
- విద్యార్థులకు మద్దతు.. సల్మాన్ ఖాన్ పై ట్రోల్స్..
