బాలయ్య-రామ్ గోపాల్ వర్మ ఈ క్రేజీ కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కాల్సి ఉంది. కాని కారణాలు తెలియవు కాని వీరి తీయల్సిన సినిమా ఆగిపోయింది. అప్పటి నుంచి వర్మ బాలయ్య సినిమాలపై కామెంట్స్ చేస్తునే ఉన్నాడు. తాజాగా బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ జీవిత కథతో ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు. రామ్ గోపాల్ వర్మ కూడా ఎన్టీఆర్ జీవిత కథకు లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే పేరు పెట్టి ఓ సినిమా తీస్తున్నాడు. బాలయ్య తీసేది ఎన్టీఆర్ అసలైన కథ కాదని,నేను తీసేదే అసలైన కథ అంటున్నాడు వర్మ.
ఈ సారి ఓ అడుగు ముందుకేసి బాలయ్యకే వార్నింగ్ ఇచ్చాడు వర్మ. దీనికి సంబంధించి తన ఫేస్ బుక్లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు వర్మ. ఈ వీడియోలో బాలయ్య వాయిస్ తో వర్మకి వార్నింగ్ ఇచ్చినట్లుగా ఉంది. ముందుగా బాలయ్య వాయిస్ తో.. ”ఒరేయ్ ఆర్జీవీ.. నాదగ్గర నేనున్నాను, విద్యాబాలన్ ఉంది, కళ్యాణ్ రామ్ ఉన్నాడు, రానా దగ్గుబాటి, సుమంత్, నిత్యామీనన్, హన్సిక, పాయల్ రాజ్ పుత్, రకుల్ ప్రీత్ సింగ్, షాలిని పాండే, ప్రకాష్ రాజ్ ఉన్నారు. మరి నీ సినిమాలో ఏముందిరా” అంటూ వార్నింగ్ వినిపించగా.. దానికి వర్మ.. ”సార్ నా దగ్గర నిజముంది.. నిజానికి సంబంధించిన సత్యం ఉంది.
సత్యాన్ని తలదన్నే యదార్ధం ఉంది. అది హైదరాబాద్ లోని వైశ్రాయ్ హోటల్ లోని సంఘటనలు అవ్వొచ్చు.. ఇంట్లోనూ, వంటింట్లోనూ జరిగిన కుటుంబ కుట్రలు అవ్వొచ్చు. సార్ నిజం నాకన్నా ఎక్కువ మీకు, మీ ఫ్యామిలీకి, మే ఇంటల్లుడుకి తెలుసు సార్. కానీ మీరు చెప్పారు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. ఎస్.. నా దగ్గర మీ సినిమాలో ఉన్న స్టార్స్ లేరు. కానీ మీ సినిమాలో ఉన్న స్టార్స్ ఎవరికీ మీ సినిమాలో ఉన్న అబద్ధాలు తెలియవు.
కానీ నా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఉన్న యాక్టర్స్ అందరికీ నిజంగా జరిగిన నిజాలు మాత్రమే తెలుసు. సత్యమేవ జయతే” అంటూ సమాధానమిచ్చాడు. దీనిని బట్టి తాను తీయబోయే సినిమానే అసలైన కథ అంటూ చెప్పుకొచ్చాడు వర్మ.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
- Advertisement -
వర్మను ‘ఒరేయ్’ అంటూ సంబోందించిన బాలయ్య
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -