Friday, May 3, 2024
- Advertisement -

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను చూసేందుకు ఎగబడుతున్న జ‌నాలు

- Advertisement -

అవును మీరు చ‌దువుతున్న‌ది నిజ‌మే. వివాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తాజాగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌. ఉమ్మ‌డి ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి, ఆంధ్రుల ఆరాధ్య దైవంగా భావించే ఎన్టీఆర్ జీవితంలోని కొన్ని సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ సినిమాను తెర‌కెక్కించాడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. ఎన్టీఆర్ జీవితంలోకి ఆయ‌న రెండో భార్య ల‌క్ష్మీ పార్వ‌తి ఎంట్రీ ఇచ్చిన ద‌గ్గ‌ర నుంచి ఆయ‌న జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయో ఈ సినిమాలో చూపించ‌పోతున్నాడు వ‌ర్మ‌.

ఎన్టీఆర్ త‌న చివ‌రి రోజుల్లో ఎటువంటి దుర్భ‌ర జీవితాన్ని గడిపారో చూపిస్తానంటున్నారు వ‌ర్మ‌. ఇక ప్ర‌స్తుతం ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఈ సినిమా విడుద‌ల కావ‌డంతో అంద‌రి దృష్టి ఈ సినిమాపైనే ఉంది. సినిమాను ఆపాడానికి టీడీపీ పార్టీ శ‌త‌విధాల ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికి ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను విడుద‌ల కాకుండా ఆప‌డం వారి వ‌ల్ల కాలేదు. ఇక ఈ సినిమాను ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ నెల 29న విడుద‌ల చేయ‌నున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు, ప్రేక్ష‌కులు ఎంత‌గానో ఎదురు చూస్తున్నార‌ని ట్విట్ చేశారు రామ్ గోపాల్ వ‌ర్మ‌.

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా, 10 నిమిషాల వ్యవధిలో ఓ మల్టీ ప్లెక్స్ లో 1000 టికెట్లు అమ్ముడు కావడాన్ని ప్రస్తావిస్తూ, ఓ ట్వీట్ చేశారు రామ్ గోపాల్ వర్మ. ఈ స్పీడ్‌ను చూస్తుంటే బాల‌య్య న‌టించిన క‌థానాయ‌కుడు, మ‌హ‌నాయ‌కుడు కన్నా లక్ష్మీస్ ఎన్టీఆర్ ని చూడడానికే ప్రజలు ఎగబడుతున్నారని ట్విట్ చేశారు రామ్ గోపాల్ వ‌ర్మ‌. దీని బ‌ట్టి తానే తిసిందే నిజ‌మైన సినిమా అరి నిజంగా నిజమే గెలిచిందనడంలో ఏ మాత్రం సందేహం లేదని తెలిపారు. జై బాలయ్య” అని వ్యాఖ్యానించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -