Tuesday, May 21, 2024
- Advertisement -

మహేశ్ 26వ సినిమాలో .. కీలకమైన పాత్రలో రమ్యకృష్ణ, విజ‌య‌శాంతి

- Advertisement -

ప్రిన్స్ మహేష్ బాబు త‌న 26 వ సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే.ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఈ సినిమాలో న‌టించే న‌టీన‌టులు, సాంకేతిక నిపునుల‌తో సినిమాపై హైప్ పెంచేస్తున్నాయి. ఈ సినిమాలో ప‌వ‌ర్ పుల్ పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ‌, విజ‌య‌శాంతిలు న‌టిస్తున్న‌ట్లు స‌మాచారం.

ఈ సినిమాకి ‘సరిలేరు నీకెవ్వరూ’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కి సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రల‌ కోసం విజయశాంతి, ర‌మ్య‌కృష్ణ‌న‌ను న‌టించ‌డానికి అనిల్ రావిపూడి ఒప్పించినట్టుగా వార్తలు వచ్చాయి. ఇందుకుగాను ఇద్ద‌రు భారీ పారితోషికం అందుకోనున్నార‌నె టాక్ వినిపిస్తోంది.

నరసింహా చిత్రంలో నీలాంబరి పాత్ర తర్వాత రమ్యకృష్ణ పవర్‌ఫుల్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. బాహుబలిలో శివగామి పాత్ర ఆమె కెరీర్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. శైలజారెడ్డి అల్లుడులో పవర్ ఫుల్ అత్తగా సత్తా చాటింది. ఇక మ‌హేష్ పాత్ర‌లో కూడా ప‌వ‌ర్ పుల్ క్యారెక్ట‌ర్లో న‌టించ‌నున్నార‌నె వార్త‌లు వినిపిస్తున్నాయి.

రాజ‌కీయాల‌తో చాలాకాలంగా ఇండ‌స్ట్రీకి దూరంగా ఉన్న విజ‌య‌శాంతి మ‌రో సారి మేక‌ప్ వేసుకోనున్నారు. సినిమాకు అత్యంత ప్రాధాన్యం ఉన్న పాత్ర కావడంతో న‌టించేందుకు రాములమ్మ సిద్ధమైంది. దీనికి భారీ పాతోషిక‌మే డిమాండ్ చేసిన‌ట్లు తెలుస్తోంది.జూన్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -