బాలీవుడ్లో ప్రేమ ,డేటింగ్ అనేవి సర్వసాధారణం.అప్పటికి వాళ్ల రిలేషన్ స్ట్రాంగ్గా ఉంటే వ్యవహారం పెళ్లి వరకు వెళ్ళుతుంది.లేదంటే ఎవరి దారి వారిదే.తాజాగా బాలీవుడ్ హీరో ,హీరోయిన్లు హోటల్లో రూమ్ బుక్ చేసుకుని అక్కడే కాపురంపెట్టారట.పూర్తి వివరాల్లోకి వెళ్తే..బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ప్రస్తుతం హీరోయిన్ అలియా భట్తో ప్రేమలో ఉన్నాడు.వీరి పెళ్లికి రెండు కుటుంబాలు అంగీకారం తెలపడంతో ఈ జంట విచ్ఛల విడిగా తిరుగుతున్నారు.దీనిలో భాగంగానే వీరిద్దరు పెళ్లి కాకుండానే ముంబైలోని ఓ హోటల్లో కాపురం పెట్టరని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.పెళ్లి తరువాత అభిప్రాయభేదాలు వచ్చి విడిపోవడం కన్నా పెళ్లికి ముందే ఒకరినొకరు తెలుసుకుని పెళ్లి చేసుకుంటే మంచిదని వీరు ఇలా హోటల్లో స్టే చేస్తున్నారని సమాచారం.
అయితే ఇలా హోటల్లో స్టే చేయడంపై పలువురు ఈ జంటను విమర్శిస్తున్నారు.ఒకరినొకరు అర్థం చేసుకోవాలి అంటే ఎవరో ఒకరి ఇంట్లో ఉంటే సరిపోతుంది కదా … ఇలా హోటల్లో ఉండటం ఏంటీ అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.పెళ్లి తరువాత కూడా ఒకరినొకరు అర్ధం చేసుకోవచ్చని వారు అంటున్నారు.పెళ్లి తరువాత జరిగే తతంగం ముందే కావాలని వీరిద్దరు హోటల్కు వెళ్లారని మరికొందరు కామెంట్స్ చేయడం విశేషం.గతంలో కూడా రణబీర్ కత్రినా కైఫ్ను హోటల్లో పెట్టి కొంతకాలం గడిపాడు.తరువాత వీరిద్దరి మధ్య అభిప్రాయభేదాలు రావడంతో విడిపోయారు.మరి ఇప్పుడు అలియాతో రణబీర్ బంధం ఎన్నాళ్లు సాగుతుందో చూడాలి.