నందమూరి బాలృష్ణ సినిమాల్లోనే కాదు బుల్లితెరపైనా సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. బాలయ్య హోస్ట్గా ఆహా ఓటీటీలో ప్రసారం అవుతున్న షో అన్స్టాపబుల్. ఈ షోకి అదిరే రెస్పాన్స్ వస్తుండగా ఇప్పటివరకు టాలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరై షో రేటింగ్ని అమాంతం పెంచేశారు. తాజాగా లేటెస్ట్ సీజన్ ప్రారంభంకానుండగా ఫస్ట్ ఎపిసోడ్కి యానిమల్ టీం వచ్చేసింది. సందీప్ వంగాతో పాటు రణబీర్ కపూర్, రష్మికా ఈ షోకి గెస్ట్లుగా వచ్చారు.
ఇందుకు సంబంధించిన ప్రొమోని రిలీజ్ చేశారు. ఇందులో భాలయ్య డైలాగ్స్ని రణబీర్ చెప్పడం విశేషం. ఫ్లూట్ జింక ముందు ఊదు సింహం ముందు కాదు, డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్, ట్రబుల్ ట్రబుల్స్ యూ అంటూ రణబీర్ చెప్పిన డైలాగ్లు ఆకట్టుకున్నాయి. చివరగా రష్మికా…విజయ్కి ఫోన్ చేయగా ఆయన చెప్పిన సమాధానం మరింత హైప్ తెచ్చింది. నవంబర్ 24 నుండి ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది.
సందీప్ వంగా దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్ డిసెంబర్ 1న విడుదలకానుంది. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.