Friday, May 17, 2024
- Advertisement -

రారండోయ్ అంటున్న మాజీ సీఎం కొడుకు

- Advertisement -

  • క‌న్న‌డ‌లో రారండోయ్ వేడుక చూద్దాం రీమేక్‌

‘రారండోయ్ వేడుక చూద్దాం’ అని మాజీ ముఖ్య‌మంత్రి కుమారుడు పిలుస్తున్నాడు. ఆ సినిమాకు, మాజీ ముఖ్య‌మంత్రి కుమారుడికి ఏం సంబంధం అనుకుంటున్నారా? ఏం లేదండీ… క‌ర్నాట‌క మాజీ ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి త‌న‌యుడు నిఖిల్ గౌడ‌. ఈ సినిమాలో న‌టిస్తున్నాడు. రారండోయ్ వేడుక చూద్దాం సినిమా అక్కినేని ఫ్యామిలీకి మంచి విజ‌యం సాధించింది. అక్కినేని నాగార్జున నిర్మాణంలో ఆయన కుమారుడు నాగచైతన్య న‌టించిన సినిమా అది. రకుల్ ప్రీత్ జంటగా కళ్యాణ్ కృష్ణ తీసిన ఈ సినిమా సూపర్ హిట్టయింది. ఆ సినిమా ఇప్పుడు కన్నడలోకి రీమేక్ అవుతోంది.

మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ ఈ సినిమా కన్నడ రీమేక్‌లో హీరోగా నటిస్తున్నార‌ని స‌మాచారం. కుమార‌స్వామి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. దీనికి ‘సీతారామ కల్యాణం’ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. నిఖిల్ గత ఏడాది రూ.75 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘జాగ్వార్’ సినిమాతో క‌న్న‌డ సినీ ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌మ‌య్యాడు. ఆ సినిమా తెలుగులోనూ విడుద‌లైంది. ఫ‌లితం నిరాశ ఎదుర‌య్యింది. తొలి సినిమాతో యాక్షన్ హీరో అయిపోదామని చూసిన నిఖిల్‌కు ఎదురు దెబ్బ తగిలింది. తర్వాత నుంచి మీడియం రేంజిలో మామూలు సినిమాలు ట్రై చేస్తున్నాడు. ఆల్రెడీ అతడి రెండో సినిమా సెట్స్ మీద ఉండగా.. తొలిసారి రీమేక్‌లో నటించడానికి అతను రెడీ అయ్యాడు.

తెలుగులో విజ‌య‌వంత‌మైన సినిమాల‌న్నీ ప‌క్క రాష్ర్టం క‌ర్నాట‌క‌లో రీమేక్‌లు స‌ర్వ‌సాధార‌ణం. క‌న్న‌డ సూప‌ర్ స్టార్ ఉపేంద్ర కూడా చాలా సినిమాల‌ను రీమేక్ చేసి న‌టించాడు. ఆ విధంగా క‌న్న‌డ సినీ ప‌రిశ్ర‌మ‌లో మంచి హీరోగా గుర్తింపు పొందాడు. మ‌న ఈగ విల‌న్ సుదీప్ కూడా ఎన్నో తెలుగు సినిమా రీమేక్‌ల‌లో న‌టించాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -