Friday, March 29, 2024
- Advertisement -

రాశీఖన్నా షాకింగ్ కామెంట్స్… వారి మెప్పుకోసమేనా ?

- Advertisement -

గ్లామరస్ హీరోయిన్ రాశీఖన్నా సౌత్ ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఊసలుగుసగుసలాడే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ భామ మీడియం రేంజ్ హీరోలతో మంచి సినిమాలే చేసింది. అయినా ఇక్కడ సరైన బ్రేక్ రాలేదు. దాంతో కోలీవుడ్, మాలీవుడ్‌ పరిశ్రమలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నించింది. అయితే అక్కడా అనుకున్నంత గుర్తింపు రాలేదు. తాజాగా రుద్ర అనే వెబ్ సిరీస్ తో బాలీవుడ్‌లో అడుగుపెట్టిందీ ముద్దుగుమ్మ. అజయ్ దేవ్ గణ్ హీరోగా తెరకెక్కించిన ఈ వెబ్‌సిరీస్‌కు పాజిటివ్ టాక్ రావడంతో రాశీ ఖన్నా ఖుషీ అవుతోంది.

ఈ సందర్భంగా జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన రాశీ ఖన్నా.. దక్షిణాది సినీ పరిశ్రమపై షాకింగ్ కామెంట్స్ చేసింది. కమర్షియల్ సినిమాల్లో హీరోల పక్కన కొద్దిసేపు కనిపించడం, పక్కకు వెళ్ళిపోవడం లాంటి రొటీన్ ఫార్ములాను సౌత్ ఇండస్ట్రీ తనకు అలవాటు చేసిందని కామెంట్ చేసింది. ఇందులో తను సైతం పడిపోయానని చెప్పుకొచ్చింది. హీరోయిన్స్ కి టాలెంట్ తో కాకుండా లుక్స్ కారణంగానే గుర్తింపునిస్తారని వ్యాఖ్యలు చేసింది. ఇది తనకు నచ్చదని చెప్పింది. కాస్త తెల్లగా ఉంటే మిల్కీ బ్యూటీ అనేస్తారనీ… కానీ అంతకు మించిన టాలెంట్ హీరోయిన్స్ లో ఉందని తెలిపింది.

ఇప్పటికైనా దీన్ని సౌత్ ప్రేక్షకులు గుర్తించాలని వ్యాఖ్యానించింది. కెరీర్ ప్రారంభంలో దక్షిణాది వారు తనని గ్యాస్ టాంకర్ అని వెక్కిరించే వారని గుర్తు చేసుకుంది. రాశీ ఖన్నా వ్యాఖ్యలపై దక్షిణాది వాసులు మండిపడుతున్నారు. బాలీవుడ్‌ ప్రేక్షకుల మెప్పుకోసం… తనకు గుర్తింపునిచ్చిన సౌత్ ఇండస్ట్రీని చులకన చేయొద్దని సూచిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -