Friday, May 3, 2024
- Advertisement -

గుండెల్ని పిండేస్తున్న ర‌ష్మిక ట్విట్‌

- Advertisement -

ర‌ష్మి మంద‌న‌… క‌న్న‌డ ఇండ‌స్ట్రీలో హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగుతు తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టింది. ఛ‌లో సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ప‌రిచియం అయింది. తొలి సినిమాతోనే హిట్‌ను త‌న ఖాతాలో వేసుకుంది. ఆ త‌రువాత వ‌చ్చిన గీతా గోవిందం సినిమాతో త‌నలోని న‌ట‌న‌ను ప్రేక్ష‌కుల‌కు ప‌రిచియం చేసింది. ఈ ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది ర‌ష్మిక‌. తెలుగు, క‌న్న‌డ‌, త‌మిళ భాషల్లో వ‌రుస సినిమాలు చేస్తు ఫుల్ బిజీగా ఉన్న ర‌ష్మిక‌ను ఓ సంఘ‌ట‌న క‌దిలిచిందట‌.

మంగళవారం రాయచూర్ అడవుల్లో ఇంజనీరింగ్ విద్యార్థినిని బలవంతం చేసి అటుపై కిరాతకంగా హత్య చేసిన దుండగులు ఆ మృత దేహాన్ని ఓ చెట్టుకు వేలాడదీసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన సంచలనం సృష్టించింది. తాజాగా దీనిపై ర‌ష్మిక కూడా స్పందించింది. మనుషుల్లో మానవత్వం ఎక్కడుంది. ఇంజనీరింగ్ విద్యార్థిని మధుపై పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన నా గుండెను బద్దలు చేసింది. ఎంత మంది ఇలాంటివి ఎదుర్కోవాలి?. ఆమెకు న్యాయం జరగాలని.. ఇదే చివరి సంఘటన కావాలని ఆశిస్తున్నా“ అంటూ ట్విట్ చేసింది ర‌ష్మిక‌. పైగా దీనిని జస్టిస్ ఫర్ మధు అని హ్యాష్ ట్యాగ్ ని పోస్ట్ చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -