మాస్ రవితేజ -శ్రీను వైట్ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా టైటిల్ లోగోని విడుదల చేశారు చిత్ర యూనిట్. పోస్టర్ ని బట్టి చూస్తుంటే విభిన్నమైన లుక్ తో డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేయడానికి సన్నద్దమవుతున్నారు. ఈ సినిమాలో రవితేజ ఫస్ట్ టైం త్రిబుల్ రోల్లో కనిపించనున్నాడు.రవితేజ సరసన హీరోయిన్లుగా ఇలియనా,శృతిహాసన్లు నటిస్తున్నారు.
త్వరలోనే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నద్దమవుతువుతుంది.చాలా రోజుల తరువాత రవితేజ-శ్రీను వైట్ల కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.గతంలో వీరిద్దరి నుంచి వచ్చిన సినిమాలు అన్ని హిట్లుగానే నిలిచాయి. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.