Wednesday, May 15, 2024
- Advertisement -

ఎన్టీఆర్ గొప్పతనం ఇటీవలే బయట పడింది!

- Advertisement -

మన తెలుగు హీరోలు సడన్ గా సినిమా విడుదల కి కాస్త ముందర వరకూ ఫాన్స్ ని గుర్తుకే తెచ్చుకోరు. అప్పటి వరకూ గుర్తు రాని ఫాన్స్ ని ఆడియో ఫంక్షన్ తరవాత నుంచీ నెత్తికి ఎక్కించుకుంటారు. సినిమా ప్రమోషన్ మొదలయ్యాక ఫాన్స్ తమ ప్రాణం అన్నట్టు ప్రవర్తించే హీరోలు సినిమా ఎలా ఉందొ చెప్తూ అంచనాలు డబల్ చెయ్యడం లో బిజీ అవుతారు. సినిమా హిట్ అయితే మళ్ళీ థాంక్స్ మీట్ లు పెట్టి విజయ యాత్రలు పెట్టి హడావిడి చేస్తారు.

ప్లాప్ అయితే చుట్టుపక్కల ఎక్కడా కనపడరు గాక కనపడరు. కానీ జూనియర్ ఎన్టీఆర్ తాను అందరిలాంటి హీరోని కాదు అని ఎప్పుడూ ప్రూవ్ చేసుకుంటూ ఉండేవాడు, మరొక సారి ఎన్టీఆర్ గొప్పతనం ఇటీవలే బయట పడింది. జనతా గ్యారేజ్ సెట్లో గత వారం రోజులుగా అదే తంతు జరుగుతోంది. రోజూ నాలుగైదు జిల్లాల నుంచి వచ్చే అభిమానుల్ని షూటింగ్ విరామంలో కలుసుకొంటున్నాడట ఎన్టీఆర్. వాళ్లతో సరదాగా మాట్లాడి పంపిస్తున్నాడట.

తారక్ అలా ఫ్యాన్స్ తో మీటింగ్ అవ్వడం వెనక రాజకీయ కోణం కూడా ఉందనేది ఇప్పుడు పలువురి మాట. మరి నిజంగానే తారక్ రాజకీయ కోణంతోనే వాళ్లని కలుసుకొంటున్నాడా లేక జనతా గ్యారేజ్ కి హైప్ తీసుకురావడం కోసమా అన్నది ఆసక్తికరంగా మారింది. జనతా గ్యారేజ్ చిత్రం ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకొస్తోంది. 2019 లో ఎన్టీఆర్ యాక్టివ్ పాలిటిక్స్ లోకి వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -