- Advertisement -
కంచె. వరుణ్ తేజ్ ను హాలీవుడ్ రేంజ్లో ట్రీట్ చేస్తూ…. క్రిష్ రూపొందించిన చిత్రం.
ఈసినిమా ఆడియో లాంచ్ ను మెగా అభిమానుల సమక్షంలో ఈనెల 11న జరపాల్సి ఉంది. కాని లాస్ట్ మినిట్లో మెగా సమీకరణాల రీత్యా ఆడియో లాంచ్ ఆగిపోయింది. ఇపుడు ఆ ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని ఈనెల 17న జరపబోతున్నారని తెలుస్తోంది.
దీంతో కంచె చిత్రానికే…. కంచె వేసినట్లయింది. ఉన్నట్లుండి ఎందుకు ఇలా ఆడియో ఫంక్షన్ ను అర్థంతరంగా ఆపేసారంటే
మాత్రం మూవీ యూనిట్ ఏం చెప్పడం లేదు. ఎవరో ఏదో రెస్పాన్స్ అవ్వొద్దని చెప్పినట్లుగా మాటా మంతీ లేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రెండో ప్రపంచ యుద్ద సమయంలో జరిగిన సినిమా కాబట్టి…ఆడియో లాంచ్ ను ఓ ఫార్మాట్ గా మార్చి…వినూత్న రీతిలో జరిపి సినిమాకు హైప్ తీసుకువద్దామని క్రిష్ భావిస్తున్నాడట.