Sunday, May 5, 2024
- Advertisement -

స‌హ‌జీవ‌నం చేసి త‌ప్పు చేశా!

- Advertisement -

రేణూ దేశాయ్, ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో విడిపోయిన ద‌గ్గ‌ర నుండి ఒంట‌రిగానే ఉంటున్న‌ప్ప‌టికి ఆమెను మీడియా నిత్యం వార్త‌ల్లో నిలుపుతునే వ‌స్తుంది. తాజాగా ఆమె మ‌రో వ్య‌క్తితో నిశ్చితార్థం చేసుకున్న సంగ‌తిని రేణూ దేశాయ్ స్వ‌యంగా ట్వీట్ట‌ర్ ద్వారా తెలిపింది. త‌న రెండో పెళ్లిపై ప‌లు ఆసక్తికర విషయాలను వెల్లడించింది రేణూ దేశాయ్. తనది ప్రేమ వివాహం కాదని, అతన్ని తాను ప్రేమించి పెళ్లాడటం లేదని రేణు వ్యాఖ్యానించారు. తనది సన్నిహితులు కుదిర్చిన వివాహమని తెలిపారు.

ఒంటరి జీవితాన్ని గడిపిన తాను, ఇప్పుడు సంతోషంగా ఉన్నానని వెల్లడించారు. అతను చాలా ప్రశాంతంగా ఉంటారని కాబోయే భర్తపై పశంసలు కురిపించిన రేణూ దేశాయ్, మళ్లీ సహజీవనం చేయాలని అనుకోవడం లేదని చెప్పుకొచ్చింది. ఇక రేణు దేశాయ్ రెండో పెళ్లిపై ప‌వ‌న్ త‌న ట్వీట్ట‌ర్ ద్వారా శుభాకాంక్ష‌లు తెలియజేసిన సంగ‌తి తెలిసిందే. రేణూ దేశాయ్ ప‌వ‌న్‌తో కొన్నాళ్లు స‌హ‌జీవ‌నం చేసిన త‌రువాత పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్ద‌రు పిల్ల‌లు పుట్టిన‌ సంగ‌తి తెలిసిందే.ఇద్ద‌రు పిల్ల‌లు రేణు దేశాయ్ ద‌గ్గ‌రే ఉంటున్నారు.

Also Read: మిస్ రేణుగారు.. మీ కొత్త జీవితం బాగుండాలి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -