Friday, March 29, 2024
- Advertisement -

కరోనా పై పోరాటం.. ఆర్ఆర్ఆర్ టీమ్ వినూత్న ప్రచారం!

- Advertisement -

దేశం వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ప్రతిరోజు నాలుగు లక్షల వరకు కేసులు పెరిగిపోతున్నాయి. మూడు వేల వరకు మరణాలు సంబవిస్తున్నాయి. కరోనా నుంచి మనల్ని మనమే రక్షించుకోవాలి.. కరోనాని తరిమి కొట్టాలని ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ వినూత్న ప్రచారం చేసిందిఆర్ఆర్ఆర్ దర్శకుడు రాజమౌళి, హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్, కీలకపాత్రధారి అజయ్ దేవగణ్, కథానాయిక అలియా భట్ ఓ వీడియోలో తమ సందేశాన్ని అందించారు.

తాజాగా సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంది. రాజమౌళి మలయాళంలో, ఎన్టీఆర్ కన్నడ భాషలో, రామ్ చరణ్ తమిళంలో, అజయ్ దేవగణ్ హిందీలో మాట్లాడారు. ఇక బాలీవుడ్ బ్యూటీ ఆలియాభట్ అచ్చమైన తెలుగు భాషలో తన సందేశాన్ని అందిచింది. కచ్చితంగా మాస్కు ధరించాలని, శానిటైజర్ తో తరచుగా చేతులను శుభ్రం చేసుకుంటుండాలని, భౌతికదూరం తప్పనిసరి అని ఆర్ఆర్ఆర్ యూనిట్ సభ్యులు పిలుపునిచ్చారు.

కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను టీకా వేసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. ఏది ఏమైనా దర్శకధీరుడు రాజమౌళి ఏదైనా వెరైటీగా ప్రచారం చేయడం తెలిసిందే.. ఈ నేపథ్యంలో ‘స్టాండ్ టుగెదర్’ పేరుతో ఆర్ఆర్ఆర్ చిత్రబృందం ఈ వీడియోను పంచుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -