Saturday, May 11, 2024
- Advertisement -

ఎస్ వి కృష్ణారెడ్డితో బాలయ్య ఎందుకు యస్ అన్నాడు

- Advertisement -

టాలీవుడ్లోనే కాదు ఎల్లో మీడియాలో ఇపుడు ఒక్కటే ప్రశ్న.బాలయ్య బాబు ఏ యాంగిల్లో థింక్ చేసి ఎస్ వి కృష్నారెడ్డి చిత్రానికి సైన్ చేసినట్లు. ఎస్ వి కృష్ణారెడ్డి అవుట్ డేటెడ్ దర్శకుడు .కాని అతను చెప్పిన కథ బాలయ్యకు భాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.జై సింహ తర్వాత షూటింగ్ పెట్టుకో అనే మాట కూడా ఇచ్చేయడంతో టిడిపి శ్రేణులు ,బాలయ్య అభిమానులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎలక్షన్ల టైమ్లో పోయిపోయి అవుట్ డేటెడ్ డైరెక్టర్ తో బాలయ్య చిత్రం చేయడమేంటి అనేది వారి ఉద్దేశ్యం.

కాకపోతే ఇక్కడ లెక్కలు మరోలా ఉన్నాయి.బాలయ్యతో ఎస్ వి కృష్ణారెడ్డి చేసే సినిమా జానపద కథాంశంతో తెరకెక్కుతుంది. ఈసినిమా పెద్దగా విజయం సాధించకపోయినా ఏం ప్రాబ్లమ్ లేదు.గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన టాప్ హీరో ఘోరంగా దెబ్బతింది. కాని సినిమా భాగానే వచ్చిందనే పేరు ఉంది. ఎట్ దిసేమ్ రానున్న ఎన్నికలలో బాలయ్య పోటీ చేసేది మళ్లీ హిందూపురం నుంచే.అలాగే…కడప,నెల్లూరు,కర్నూలు లో రెడ్లను ..జగన్ నుంచి ఎలాగైనా దూరం చేసి తన వైపుకు తిపుకోవాలి చంద్రబాబు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు.దానిలో భాగంగా రెడ్లకు మేము అనుకూలమే అనే సంకేతం కోసం అన్నట్లు పోయి పోయి అటువైపుగా అడుగులు వేస్తున్నాడనే సమాచారం వస్తుంది. ఇక్కడ చిత్రం హిట్ అయితే పేరొస్తుంది. ఫ్లాప్ పడితే..సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందనే లాజిక్ ను కొందరు వెనకనుంచి బాలయ్యకు చెప్పారు కాబట్టే…ఎస్ వి కృష్నారెడ్డికి ఓకే చెప్పినట్లుగా కనిపిస్తుందని ఎల్లో మీడియా వర్గాలు బాహాటంగా చెప్పేస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -