Saturday, May 11, 2024
- Advertisement -

అట్టహాసం గా సాహో ప్రీ రిలీజ్ వేడుక

- Advertisement -

సాహో సినిమా గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. నిన్న రామోజీ ఫిలిం సిటీ లో అంగరంగ వైభవంగా ఈ సినిమా కి సంబందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక జరిగింది. ఈ సినిమా వేడుక కి రాజమౌళి,అల్లు అరవింద్,దిల్ రాజు, శ్యాం ప్రసాద్ రెడ్డి, వినాయక్ వంటి వారు వచ్చి వారి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ప్రభాస్ కూడా అభిమానులకి హిట్ కొడుతున్నా అని ధీమా తో చెప్పాడు.

ఇక సాహో సినిమా ఎప్పుడు మొదలవుతుంది అని అందరూ ఎదురు చూసారు. తీరా మొదలయ్యాక ఎన్నో రోజుల షూట్ తర్వాత​​ ఇప్పుడు రిలీజ్ కి దగ్గర అవుతుంది ఈ సినిమా. అయితే ఈ సినిమా ని దాదాపు గా 333 కోట్ల కి అమ్మారని టాక్ నడుస్తుంది. ఈ సినిమా రికవరీ అవ్వాలంటే, సినిమా పెద్ద మొత్తం లో నే వసూలు చేయాలి. ఈ సినిమా ని అత్యధిక ధరల్లో చాలా ఏరియాల్లో అమ్మడం జరిగింది. సాహో సినిమా కి సంబందించిన వరల్డ్ వైడ్ థియాట్రికల్ బిజినెస్: ₹333Crs వరకు జరిగింది అనేది వాస్తవం కాబట్టి లాభాలు అదే రేంజ్ లో ఉండాలి.

సుజీత్ దర్శకత్వం లో, యువీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థ లో ఈ సినిమా, ఈ నెల 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -