Sunday, April 28, 2024
- Advertisement -

ఆ విషయం మర్చిపోయిన సాహో నిర్మాతలు

- Advertisement -

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన చిత్రం సాహో. ఒక స్పై థ్రిల్లర్ గా ఈ సినిమా రూపుదిద్దుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. సుజీత్ ఈ సినిమా కి దర్శకుడు. శ్రద్ధ కపూర్ ఈ సినిమా తో తెలుగు సినిమా పరిశ్రమ లో కి అడుగు పెడుతుంది. జాకీ ష్రాఫ్, అరుణ్ విజయ్, మందిరా బేడీ, మరియు అనేక మంది ఈ సినిమా లో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

గత నెల 30 న విడుదల అయిన ఈ సినిమా యొక్క క్రేజ్ అంతకంతకూ పెరుగుతూ వస్తుంది. అయితే ఈ సినిమా మీద ఉన్న అంచనాలని రీచ్ అవ్వాలని సినిమా యూనిట్ బాగా ప్రమోట్ చేసింది. ప్రభాస్ మరియు శ్రద్ధ కపూర్ ఇంటర్వూస్ కూడా బాగా ఇచ్చారు. అయితే ట్విట్టర్ ఈ సినిమా కోసం ఒక ఎమోజీ ని సృష్టించింది. తెలుగు సినిమాల్లో ఒక ఎమోజీ సంపాదించుకున్న సినిమా సాహో. ఈ సినిమా కోసం మంచి బ్రాండింగ్ చేశారు దర్శక నిర్మాతలు.

కాకపోతే సినిమా విడుదల అవ్వగానే సినిమా ప్రమోషన్స్ పూర్తి గా తగ్గిపోయాయి. సినిమా కి కొంచెం నెగటివ్ టాక్ ఉన్న విషయం వాస్తవమే కానీ సినిమా పిక్ అప్ అవ్వాలి అంటే పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ మీద కూడా సినిమా యూనిట్ దృష్టి పెట్టాలి. ఈ విషయం నిర్మాతలు గుర్తిస్తే ఇప్పటికీ మించిపోయింది ఏమి లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -