కుటుంబ అండ లేకుండా తన సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న మెగా నటుడు సాయిధరమ్ తేజ్ ఎప్పుడూ ప్రత్యేకత చాటుకుంటున్నాడు. తన విభిన్నమైన స్టైల్లో ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. మొన్న అభిమానుల కాళ్లు మొక్కి అందరీ దృష్టిలో పడ్డాడు. ఇప్పుడు మరో సేవ కార్యక్రమంతో మానవత్వం చాటుకున్నాడు. ఓ దివ్యాంగుడినైన క్రీడాకారుడుని ఆదుకున్నాడు.
సూర్యాపేట జిల్లాకు చెందిన రంగుల నరేశ్యాదవ్ దివ్యాంగుడు. అంతర్జాతీయ టోర్నమెంట్లో పాల్గొన్నాడు. భారత జట్టుకు ఎంపికైనా అక్కడికి వెళ్లేందుకు డబ్బులు లేక పారా అథ్లెట్ నరేశ్ అనేక ఇక్కట్లు పడుతున్నాడు. ఇటీవల అతడి ఆర్థిక పరిస్థితి బాగా లేదని తెలుస్తోంది. అతడి ఆర్థిక పరిస్థితి కారణంగా అంతర్జాతీయ క్రీడా పోటీలకు వెళ్లలేకపోయాడు. ఈ పరిస్థితిని తెలుసుకున్న సాయిధరమ్ తేజ్ స్పందించాడు. తేజ్ ఉదార స్వభావంతో గురువారం (ఫిబ్రవరి 1) నరేశ్ యాదవ్కు రూ.లక్ష చెక్కును స్వయంగా అందజేశారు. అనంతరం నరేశ్ గురించి వివరాలు, వాలీబాల్ ప్రాక్టీస్కు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. వాలీబాల్ చాంపియన్షిప్లో విజయం సాధించాలని కోరుతూ నరేశ్కు శుభాకాంక్షలు తెలిపారు.
ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న దివ్యాంగ క్రీడాకారుడు నరేశ్యాదవ్కు మీరు సాయం చేయాలనుకుంటే ఈ నంబర్లలో 96665 93696, 97002 85868 సంప్రదించవచ్చు.