Monday, May 6, 2024
- Advertisement -

మేన‌ల్లుడుతో వెంకీ హీరోయిన్‌

- Advertisement -

వెంక‌టేష్‌తో గురు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది బాక్సింగ్ బ్యూటీ రితికా సింగ్.నిజ జీవితంలో కూడా బాక్స‌ర్ అయిన రితికా సింగ్ సినిమాలో కూడా ఆ రోల్‌లోనే న‌టించింది.త‌మిళ‌,తెలుగు రెండు భాష‌ల‌లో రితికానే హీరోయిన్‌గా చేసింది.సినిమా విజ‌యం సాధించిన అవ‌కాశాలు మాత్రం పెద్ద‌గా రాలేదు.అయితే తాజాగా ఆమెకు మెగా కాంపౌండ్ నుండి పిలుపు వ‌చ్చింద‌ని స‌మాచారం.

ద‌ర్శ‌కుడు కిషోర్ తిరుమల మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ తో ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు.ఈ సినిమాలో హీరోయిన్‌గా రితికా సింగ్‌ను తీసుకుంటున్నారని స‌మాచారం. సాయి ధ‌ర‌మ్ తేజ్ ప్ర‌స్తుతం తేజ్ ఐ లవ్ యు సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్నాడు.కిషోర్ తిరుమల సినిమా వ‌చ్చే నెల‌లో ప్రారంభం అయ్యే అవ‌కాశం ఉంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -