Saturday, May 4, 2024
- Advertisement -

ప్లాప్ ద‌ర్శ‌కుడికే అవ‌కాశం ఇచ్చిన మెగా హీరో..

- Advertisement -

ప్రేమకథల స్పెషలిస్ట్ గా పేరున్న కరుణాకరన్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ .. ‘తేజ్ ఐ లవ్ యూ’ సినిమా చేశాడు. రీసెంట్ గా ఈ సినిమా టాకీపార్టును పూర్తిచేసుకుంది. ఈ చిత్రం జూన్‌ 29న విడుదల కానుంది. దాంతో కిషోర్ తిరుమలతో కలిసి సెట్స్ పైకి వెళ్లడానికి తేజు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన దర్శకుడు గోపీచంద్ మలినేనితో కలిసి ఒక సినిమా చేయనున్నట్టు చెబుతున్నారు.

సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో ‘విన్నర్‌’ సినిమా గ‌తంలో రూపొందిన విషయం తెలిసిందే. అదే కాంబినేషన్‌ మరోసారి చేతులు కలిపింది. భగవాన్ – పుల్లారావు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు. వచ్చేనెలలో ఈ సినిమాను లాంచ్ చేసే ఆలోచనలో వున్నారు. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ లుక్ కొత్తగా ఉంటుందనీ .. ఆయన నటనలో కొత్తకోణాన్ని గోపీచంద్ ఆవిష్కరించనున్నాడని అంటున్నారు.

గతంలో ‘విన్నర్’తో ప్లాప్ ఇచ్చిన గోపీచంద్ కి సాయిధరమ్ తేజ్ మరో ఛాన్స్ ఇవ్వడం విశేషంగా చెప్పుకుంటున్నారు. ఇది వరకూ నిరాశపరిచినప్పటికి ఈ సారి మాత్రం టార్గెట్‌ మిస్‌ అవ్వకూడదని ఫిక్స్‌ అయింది. అందుకే ఈసారి ఇంకా స్ట్రాంగ్‌ స్క్రిప్ట్‌తో ముందుకొస్తుందట . ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ జూలై మొదటి వారం నుంచి స్టార్ట్‌ కానుందని సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -