- Advertisement -
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఎందుకనో అనుకున్నంత సక్సెస్ కాలేదు.సాయి ధరమ్ తేజ్ మొదట్లో సినిమాలు బాగానే ఉన్నప్పటికి తరువాత కాలంతో మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించి చేతులు కాల్చుకున్నాడు.సాయి ధరమ్ తేజ నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఘెరంగా ఫెయిల్ అయ్యాయి.సాయి ధరమ్ తేజ్, కల్యాణి ప్రియదర్శన్ జంటగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నాడు.
సాయి ధరమ్ తేజ్11వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి ‘చిత్ర లహరి’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. ‘రంగస్థలం, జనతా గ్యారేజ్ లాంటి సినిమాలని అందించిన మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.మరి ఈ సినిమా అయిన సాయి ధరమ్ తేజ్కు హిట్ ఇస్తుందో లేదో చూడాలి.