Sunday, May 19, 2024
- Advertisement -

తిక్క సినిమాకి ఆఖరి 25 నిమిషాలు హై లైట్ .. నవ్వులే నవ్వులు

- Advertisement -

హీరో సాయి ధరం తేజ మెగా ఫామిలీ నుంచి వచ్చే ఒక ప్రామిస్ హీరో లా కనిపిస్తున్నాడు. ఎంచుకుంటున్న కథలు గానీ కమర్షియల్ రిజల్ట్ కానీ చాలా చక్కగా సాగుతోంది ఈ కుర్రాడి కెరీర్ . మొన్నటికి మొన్న సుప్రీం సినిమాతో మంచి రెవెన్యూ సాధించిన మనోడు యాభై రోజులు దాదాపు 25 సెంటర్ లలో సాధించి కొత్త రికార్డు నెలకొల్పాడు.

హ్యాట్రిక్ హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్న సాయి కొత్త సినిమా ” తిక్క ” విషయం లో చాలా సీరియస్ గా ఉన్నాడు. ఈ సినిమా కోసం ఫైట్ లకి స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ లో ఉండగా చివరి 25 నిమిషాలు ఈ సినిమాకి హై లైట్ అని చెబుతున్నారు.

రొమాంటిక్ కామెడీ పంథాలో సాగే ఈ సినిమాలో అనగనగా ఒక రోజు , మనీ మనీ సినిమాల తరహా లో క్లైమాక్స్ హాస్యంతో సాగుతుందట. చాలా కాలం పాటు ఈ సినిమా క్లైమాక్స్ ని జనం గుర్తు పెట్టుకుంటారు అనీ , అవుట్ పుట్ కూడా పెర్ఫెక్ట్ గా అనుకున్నట్టుగా స్క్రిప్ట్ లో ఉన్నది ఉన్నట్టుగా వచ్చింది అంటున్నారు. రోహిణి రెడ్డి అనే ప్రొడ్యూసర్ ప్రొడక్షన్ చేసిన ఈ సినిమాలో సాయి కి తోడుగా లారిస్సా బోనేసి నటిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -