విభిన్న కథాంశాలతో సినిమాలు తీస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు శర్వానంద్. తెలుగు సినీ పరిశ్రమలో 2017 సంవత్సరంలో మూడు సినిమాలతో వచ్చినా రెండు సినిమాలు హిట్ కొట్టేశాడు. ఇప్పుడు మళ్లీ మరో సినిమాతో రానున్నాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అతడికి జోడిగా ఫిదా మూవీ ఫేమ్ సాయిపల్లవి నటించనుందని చిత్ర బృందం ట్విట్ చేసింది.
శ్రీలక్ష్మి వెంకటేశ్వర్ సినిమాస్ బ్యానర్పై ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చెరుకూరి నిర్మాతలుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. అయితే శర్వానంద్ నటనకు సాయిపల్లవి తోడు అవుతుంటే ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే నానితో సాయిపల్లవి ఎంసీఏ మిడిల్ క్లాస్ అబ్బాయ్గా వచ్చి హిట్ కొట్టింది. ఇలా శర్వానంద్తో నటిస్తూ మంచి క్లాసిక్ హిట్ కొట్టే అవకాశం ఉంది.