వినోదాత్మక చిత్రాల దర్శకుడు మారుతి తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం శైలజారెడ్డి అల్లుడు. నాగ చైతన్య, అను ఇమ్మాన్యుయేల్ ఈ చిత్రంలో జంటగా నటిస్తున్నారు. రమ్య కృష్ణ కీలక పాత్రలో నటిస్తోంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ చిత్రం ఆగష్టు 31 న విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్.
టీజర్లో ‘ఇప్పుడు నువ్వు ఐ లవ్ యూ అని ప్రొపైజ్ చెయి.. ఐ లవ్ యూ టూ అని ఏక్సెప్ట్ చేస్తా’ అని నాగచైతన్యతో అనూ ఇమాన్యుయేల్ అనడం, ‘పిల్ల పిట్టల్లా ఇంతే ఉన్నా..’ అంటూ నటుడు రఘుబాబు చెప్పడం ఈ టీజర్ లో ఉన్నాయి. ‘ఈ పిల్లే ఇలా ఉంటే తల్లి ఎలా ఉంటుందో!’ అని నాగ చైతన్య డైలాగ్ అనంతరం, రమ్యకృష్ణ సీరియస్ గా నడుచుకుంటూ వస్తుండటం గమనించవచ్చు. కాగా, ఈ నెల 31న శైలజారెడ్డి అల్లుడు’ ప్రేక్షకుల ముందుకు రానుంది. నాగచైతన్యకు జోడీగా అనూ ఇమాన్యుయల్ నటిస్తోంది. ఈ సినిమాలో నాగచైతన్యకు అత్త పాత్రలో ప్రముఖ నటి రమ్యకృష్ణ నటిస్తోంది.