Saturday, April 27, 2024
- Advertisement -

బాలీవుడ్‌లోకి సాయి పల్లవి!

- Advertisement -

ప్రేమమ్ సినిమాతో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసిన బ్యూటీ సాయి పల్లవి. మలయాళీ భామ అయిన అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపిస్తుంది. ఇక శేఖర్ కమ్ముల ఫిధాలో భానుమతిగా అలరించి మెప్పించింది. తెలంగాణ యాసలో బద్మాష్ బలిసిందారా అంటూ పల్లవి చెప్పినా డైలాగ్ ఇప్పటికి అందరికి గుర్తుండే ఉంటుంది. ఇక సాయి పల్లవి అంటే డైలాగ్‌లే కాదు డ్యాన్స్ కూడా.

భానుమతిగా అలరించిన సాయి పల్లవి దక్షిణాదిన క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. సెలక్టివ్‌గా సినిమాలు చేసుకుంటూ హిట్ కొడుతూ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంటోంది ఈ భామ. ఇక ఇప్పటివరకు సౌత్‌ని ఏలిన ఈ బ్యూటీ ఇకపై బాలీవుడ్‌ని ఏలేందుకు సిద్ధమవుతోంది.

తాజా అప్‌డేట్ ప్రకారం బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ తో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుందట సాయి పల్లవి. ఈ సినిమాకు సునీల్ పాండే దర్శకత్వం వహించనున్నారు. ఇక ఈ సినిమాతో బాలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వనున్న సాయిపల్లవికి అంతా బెస్ట్ విషెస్ చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -