బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ బెయిల్ వచ్చిన తరువాత వేగంగా తను ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేయలని భావిస్తున్నాడు.సినిమా షూటింగ్లతో బిజి బిజిగా గడుపుతున్నాడు. సల్మాన్ ఖాన్ ‘భారత్’ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనున్నారు. టైగర్ జిందా హై ఫేమ్ అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో కత్రిన కైప్ హీరోయిన్గా చేస్తుంది. మరో కీలక పాత్రలో ప్రియాంక చోప్రా నటిస్తుందని సమాచారం. ఇది నిజమైతే సల్మాన్తో ఆమె నటించి 10 సంవత్సరాలు. ‘ముజ్ సే షాదీ కరోగీ’ సినిమాలలో ప్రియాంక సల్మాన్తో నటించారు. 10 సంవత్సరాల తరువాత మళ్లీ సల్మాన్తో ప్రియాంక నటిస్లుండటం విశేషం.
దీనిపై స్పందించిన ప్రియాంక …. ‘‘భారత్’ టీమ్తో పనిచేయడానికి ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. సల్మాన్, అలీలతో మరోసారి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. గతంలో వారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. మళ్లీ ఈ సినిమాతో ఆ అవకాశం లభించింది’ అంటూ ప్రియాంక ఆనందం వ్యక్తం చేశారు.‘సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఒక వ్యక్తి, జాతి కలిసి చేసే ప్రయాణం ‘భారత్’. ఈద్ 2019’ అంటూ దర్శకుడు అలీ అబ్బాస్ చేసిన ట్వీట్ను బట్టి చూస్తే.. సినిమా కోసం మరో ఏడాదిపాటు వేచి చూడక తప్పదు.